Political News

జ‌గ‌న్‌కు బంధువును కాబ‌ట్టే ప‌క్క‌న పెట్టారు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న అల‌క వ‌హించ‌డం… తాడేప‌ల్లి నుంచి రాయ‌బారాలు జ‌ర‌గ‌డం.. వంటివి తెలిసిందే. త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా చేస్తున్న‌ట్టు ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెప్పించారు. అయితే.. ఆ త‌ర్వాత‌.. ఈ విష‌యంపై.. తాను మ‌ధ‌న ప‌డ‌డం లేద‌ని.. అన్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్‌త బాలినేని భేటీ కావ‌డ‌మే!  త‌ర్వాత‌.. అంతా స‌ర్దుమ‌ణిగింది.

ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్.. బాలినేని సొంత నియోజ‌క‌వ‌ర్గం ఒంగోలులో ప‌ర్య‌ట‌న కూడా చేశారు.. ఇక్క‌డ నుంచి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టారు. దానిలో మంత్రి క‌న్నా ఎక్కువ‌గా.. బాలినేని వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఈ క్ర‌మంలో అంతా బాగానే ఉంద‌ని.. అనుకున్నారు అంద‌రూ! అయితే.. తాజాగా.. త‌నను మంత్రి వ‌ర్గం నుంచి తీసేయ‌డంపై మ‌రోసారి బాలినేని స్పందించారు. త‌న‌కు బాధ త‌గ్గింద‌న్న ఆయ‌న‌.. త‌న అనుచ‌రులు మాత్రం ఇంకా బాధ‌ప‌డుతూనే ఉన్నార‌ని అన్నారు.

తాను సీఎం జగన్ రెడ్డికి బంధువును కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం చెబుతున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు చెప్పిన వారినే వలంటీర్లుగా నియమించామన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్య కారకులు వలంటీర్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రి పదవిలో నుంచి నన్ను ఎందుకు తీసేశారని కొంతమంది అడుగుతున్నారని, బంధువును కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం చెబుతున్నారన్నారు. త‌న‌కు ఈ విష‌యంలో బాధ‌లేద‌ని.. అయితే.. త‌న అనుచ‌రులు మాత్రం కొంత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. వైసీపీ బలోపేతానికి జిల్లాలో గడపగడపకు తాను తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. తనను గెలిపించే బాధ్యత వలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని బాలినేని పేర్కొన్నారు. 

This post was last modified on April 29, 2022 10:24 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago