Political News

వాసిరెడ్డి వ‌ర్సెస్ బొండా.. రోడ్డున ప‌డ్డ ర‌గ‌డ‌

ఏపీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాలు ఒక‌వైపు తీవ్ర కాక రేపుతున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌హిళా క‌మిష‌న్‌కు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య కూడా తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. నువ్వు ఒక‌టంటే.. నే నాలుగంటా! అంటూ..  టీడీపీ, మ‌హిళా క‌మిష‌న్లు రెచ్చిపోతున్నాయి. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన దివ్యాంగురాలి అత్యాచార ఘ‌ట‌న , త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మిష‌న్‌కు టీడీపీకి మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీద‌కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. వ‌ర్సెస్ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య చోటు చేసుకున్న  వివాదం మరింత ముదురుతోంది. బుధ‌వారం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను ఉద్దేశించి.. చైర్ ప‌ర్స‌న్ ప‌ద్మ‌.. ప‌ది త‌ప్పులు చేశారంటూ.. మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది తీవ్ర వివాదం అయింది. ఇక‌, తాజాగా.. దీనికి కౌంట‌ర్‌గా.. బొండా ఉమా “నువ్వు .. నువ్వు..“ అని క‌నీస గౌర‌వం కూడా లేకుండా… ప‌ది త‌ప్పులు చూపించారు.

ఇలా ఒక మ‌హిళా క‌మిష‌న్ విష‌యంలో ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డం.. రాజ‌కీయాలకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విస్మ‌యం.. వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా సంధించిన‌ 10 ప్రశ్నలు ఇవే..

1. మహిళ కమిషన్ చైర్మన్‌గా ఉంటూ 3 రోజుల వరకూ ఎందుకు పరామర్శించడానికి రాలేదు?
2. నువ్వు పరామర్శించాటానికి వచ్చావా పబ్లిసిటీ కోసం వచ్చావా?
3. నువ్వు ఇచ్చిన నోటీసులు తాడేపల్లి స్క్రిప్ట్ అవునా.. కాదా?
4. నువ్వు పబ్లిసిటీ కోసం వచ్చింది నిజమే కదా?
5.10 మంది పట్టని రూమ్‌లో 100 మంది ఉన్నారని అనటం అబద్ధం కదా?
6. మానసిక వికలాంగురాలైన మహిళపై అత్యాచారం జరిగితే వైసీపీ ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా?

7. నీకు వైసీపీ ప్రయోజ‌నాలు తప్పితే మహిళల సమస్యలు పట్టవా?
8. చంద్రబాబు పరామర్శకు రాక పోతే మీరు బాధితులను పట్టించుకొనేవారా?
9. మేము 10 తప్పులు చేశమన్నావ్.. ఎక్కడో నిరూపించు
10. ఇంకా 90 తప్పుడు కేసులు పెట్టుకో భయపడం

కొస‌మెరుపు:  ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఏపీలో ఈ వివాదం.. ముదిరి.. గ‌తంలో కేర‌ళ‌లో ఏర్ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. కేర‌ళ‌లో ఇలానే మ‌హిళా క‌మిష‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌.. ప్ర‌తిప‌క్ష నేత బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. అక్క‌డి హైకోర్టు ఆదేశించ‌డంతోపాటు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను క‌మిష‌న్ ఖ‌ర్చుల‌కు చెల్లించాల‌ని సైతం పేర్కొంది.

This post was last modified on April 29, 2022 7:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago