Political News

వాసిరెడ్డి వ‌ర్సెస్ బొండా.. రోడ్డున ప‌డ్డ ర‌గ‌డ‌

ఏపీలో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాలు ఒక‌వైపు తీవ్ర కాక రేపుతున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌హిళా క‌మిష‌న్‌కు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య కూడా తీవ్ర వివాదాలు కొన‌సాగుతున్నాయి. నువ్వు ఒక‌టంటే.. నే నాలుగంటా! అంటూ..  టీడీపీ, మ‌హిళా క‌మిష‌న్లు రెచ్చిపోతున్నాయి. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగిన దివ్యాంగురాలి అత్యాచార ఘ‌ట‌న , త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మిష‌న్‌కు టీడీపీకి మ‌ధ్య తీవ్ర యుద్ధం తెర‌మీద‌కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. వ‌ర్సెస్ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య చోటు చేసుకున్న  వివాదం మరింత ముదురుతోంది. బుధ‌వారం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను ఉద్దేశించి.. చైర్ ప‌ర్స‌న్ ప‌ద్మ‌.. ప‌ది త‌ప్పులు చేశారంటూ.. మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది తీవ్ర వివాదం అయింది. ఇక‌, తాజాగా.. దీనికి కౌంట‌ర్‌గా.. బొండా ఉమా “నువ్వు .. నువ్వు..“ అని క‌నీస గౌర‌వం కూడా లేకుండా… ప‌ది త‌ప్పులు చూపించారు.

ఇలా ఒక మ‌హిళా క‌మిష‌న్ విష‌యంలో ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డం.. రాజ‌కీయాలకు ప్రాధాన్యం ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా విస్మ‌యం.. వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా సంధించిన‌ 10 ప్రశ్నలు ఇవే..

1. మహిళ కమిషన్ చైర్మన్‌గా ఉంటూ 3 రోజుల వరకూ ఎందుకు పరామర్శించడానికి రాలేదు?
2. నువ్వు పరామర్శించాటానికి వచ్చావా పబ్లిసిటీ కోసం వచ్చావా?
3. నువ్వు ఇచ్చిన నోటీసులు తాడేపల్లి స్క్రిప్ట్ అవునా.. కాదా?
4. నువ్వు పబ్లిసిటీ కోసం వచ్చింది నిజమే కదా?
5.10 మంది పట్టని రూమ్‌లో 100 మంది ఉన్నారని అనటం అబద్ధం కదా?
6. మానసిక వికలాంగురాలైన మహిళపై అత్యాచారం జరిగితే వైసీపీ ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా?

7. నీకు వైసీపీ ప్రయోజ‌నాలు తప్పితే మహిళల సమస్యలు పట్టవా?
8. చంద్రబాబు పరామర్శకు రాక పోతే మీరు బాధితులను పట్టించుకొనేవారా?
9. మేము 10 తప్పులు చేశమన్నావ్.. ఎక్కడో నిరూపించు
10. ఇంకా 90 తప్పుడు కేసులు పెట్టుకో భయపడం

కొస‌మెరుపు:  ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఏపీలో ఈ వివాదం.. ముదిరి.. గ‌తంలో కేర‌ళ‌లో ఏర్ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. కేర‌ళ‌లో ఇలానే మ‌హిళా క‌మిష‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌.. ప్ర‌తిప‌క్ష నేత బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. అక్క‌డి హైకోర్టు ఆదేశించ‌డంతోపాటు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను క‌మిష‌న్ ఖ‌ర్చుల‌కు చెల్లించాల‌ని సైతం పేర్కొంది.

This post was last modified on April 29, 2022 7:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

16 minutes ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

1 hour ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

2 hours ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

5 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

8 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

8 hours ago