Political News

బాదుడే బాదుడు.. మ‌రింత తీవ్రం చేయండి: చంద్ర‌బాబు

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ దోపిడీ, పన్నులతో బాదుడు పాలనను ప్రజలకు చాటిచెప్పేలా మరింత  ప్రభావవంతంగా `బాదుడే బాదుడు` కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సామాన్యుడు నుంచి మధ్యతరగతి ప్రజలు సైతం చితికిపోయేలా జగన్ బాదుడు ఉందని చంద్రబాబు అన్నారు. పన్నులు, అధిక ధరలు, కరెంట్, బస్సు చార్జీల మోత పై తెలుగు దేశం తలపెట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు.

గ్రామ కమిటీలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, పన్నుల భారం, చార్జీల మోతపై ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. జగన్ అసమర్థ పాలనలో పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులను ఎలా ధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలు చూసారని చంద్రబాబు అన్నారు. అస్తవ్యస్థ ఆర్థిక విధానాలపై ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు వెలిబుచ్చుతున్న ఆందళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి లో బాలుడి మృతదేహాన్ని తండ్రి ద్విచక్ర వాహనం పై తరలించిన పరిస్థితికి వ్యవస్థల విధ్వంసమే కారణం అని చంద్రబాబు అన్నారు.

బాదుడే బాదుడు నిరసనలతో పాటు… పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా చంద్ర‌బాబు రివ్యూ చేశారు. టెక్నాలజీ ద్వారా, అత్యంత సులభంగా మెంబర్ షిప్ పొందే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. భారీ ఎత్తున మెంబర్ షిప్ చెయ్యడం లో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరి పనితీరును లెక్కిస్తామని.. పని చేసిన వారికి తగిన గౌరవం ఉంటుందని అన్నారు. మెంబర్ షిప్ తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల ప్రమాధ బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో కొంత సాయం అదించే సౌకర్యం కూడా ఉందని తెలిపారు.

దురదృష్టవ శాత్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొయిన కార్యకర్తల కుటుంబాలను బీమా ద్వారా ఆదుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దాదాపు 100 కోట్ల రూపాయల సాయం అందించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కార్యకర్తలకు సంక్షేమం కోసం నారా లోకేష్ నేతృత్వంతో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ క‌మిటీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి సంబందించిన రూట్ మ్యాప్‌ను రెడీ చేస్తుంద‌ని చెప్పారు. 

This post was last modified on April 27, 2022 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago