Political News

బాదుడే బాదుడు.. మ‌రింత తీవ్రం చేయండి: చంద్ర‌బాబు

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ దోపిడీ, పన్నులతో బాదుడు పాలనను ప్రజలకు చాటిచెప్పేలా మరింత  ప్రభావవంతంగా `బాదుడే బాదుడు` కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సామాన్యుడు నుంచి మధ్యతరగతి ప్రజలు సైతం చితికిపోయేలా జగన్ బాదుడు ఉందని చంద్రబాబు అన్నారు. పన్నులు, అధిక ధరలు, కరెంట్, బస్సు చార్జీల మోత పై తెలుగు దేశం తలపెట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిందని ఆయన తెలిపారు.

గ్రామ కమిటీలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, పన్నుల భారం, చార్జీల మోతపై ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. జగన్ అసమర్థ పాలనలో పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులను ఎలా ధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలు చూసారని చంద్రబాబు అన్నారు. అస్తవ్యస్థ ఆర్థిక విధానాలపై ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణులు వెలిబుచ్చుతున్న ఆందళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రి లో బాలుడి మృతదేహాన్ని తండ్రి ద్విచక్ర వాహనం పై తరలించిన పరిస్థితికి వ్యవస్థల విధ్వంసమే కారణం అని చంద్రబాబు అన్నారు.

బాదుడే బాదుడు నిరసనలతో పాటు… పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా చంద్ర‌బాబు రివ్యూ చేశారు. టెక్నాలజీ ద్వారా, అత్యంత సులభంగా మెంబర్ షిప్ పొందే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. భారీ ఎత్తున మెంబర్ షిప్ చెయ్యడం లో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరి పనితీరును లెక్కిస్తామని.. పని చేసిన వారికి తగిన గౌరవం ఉంటుందని అన్నారు. మెంబర్ షిప్ తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల ప్రమాధ బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో కొంత సాయం అదించే సౌకర్యం కూడా ఉందని తెలిపారు.

దురదృష్టవ శాత్తూ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పొయిన కార్యకర్తల కుటుంబాలను బీమా ద్వారా ఆదుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దాదాపు 100 కోట్ల రూపాయల సాయం అందించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కార్యకర్తలకు సంక్షేమం కోసం నారా లోకేష్ నేతృత్వంతో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ క‌మిటీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి సంబందించిన రూట్ మ్యాప్‌ను రెడీ చేస్తుంద‌ని చెప్పారు. 

This post was last modified on April 27, 2022 9:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు ఢిల్లీ లో తెలుగు వారే టార్గెట్

మాట‌ల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్క‌డున్నా వారిని త‌న‌వైపు తిప్పుకోగ‌ల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం…

55 minutes ago

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…

2 hours ago

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…

2 hours ago

12 ఏళ్ళ రీమేక్ ఇప్పుడెందుకు స్వామి

నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…

2 hours ago

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…

2 hours ago

శేఖర్ కమ్ముల కాంప్రోమైజ్ అవ్వట్లేదు

నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…

3 hours ago