Political News

కాంగ్రెస్ పై పీకే దెబ్బ తప్పదా?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) దెబ్బ పడినట్లే ఉంది. నిజానికి పీకే చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మిగిలిన దేశంలో పరిస్ధితి ఎలాగున్నా తెలంగాణా మాత్రం కాంగ్రెస్ పై దెబ్బ పడినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పునరుత్ధానాకి పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పరిస్థితులన్నీ కలిసొస్తే చాలా తొందరలోనే పీకే కాంగ్రెస్ లో చేరటం గ్యారెంటీ. అంటే తొందరలోనే పీకే కాంగ్రెస్ నేత కమ్ వ్యూహకర్తగా మారబోతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేసీయార్ కోసం పీకే పనిచేస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలు బద్ధ వ్యతిరేకం. అలాంటి రెండు పార్టీలతో పీకే ఏకకాలంలో ఎలా పనిచేయగలరు ? ఇక్కడే సీన్ లోకి బీజేపీ ఎంటరయ్యింది.

కాంగ్రెస్-టీఆర్ఎస్ లు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ చీఫ్ బండి సంజయ్ అండ్ కో మొదలు పెట్టేశారు. కేసీయార్ పైన కాంగ్రెస్ నేతల ఆరోపణలు, విమర్శలన్నీ నాటకాలే అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు, నిరసనలంటు జనాలను తప్పుదోవ పాటిస్తున్నారన్న బండి ఆరోపణలకు హస్తం పార్టీ నేతలు ధీటైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు.

అందుకనే తమతో కలిసి పని చేయాలంటే ఇతర పార్టీలతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని కాంగ్రెస్ షరతులు విధించినట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే రేవంత్ మాటలను జనాలు నమ్ముతారా ? ఎందుకంటే తనకు బదులుగా టీఆర్ఎస్ కు తన సంస్థ ఐప్యాక్ పనిచేస్తుందని పీకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పీకే వేరు ఐప్యాక్ వేరు కానపుడు టీఆర్ఎస్ కోసం పీకే పని చేస్తే ఏమిటి ? పీకే సంస్థ ఐప్యాక్ పని చేస్తే ఏమిటి ? అందుకనే తెలంగాణా కాంగ్రెస్ పై పీకే దెబ్బ పడినట్లే అనుమానంగా ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on April 26, 2022 10:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

50 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago