Political News

ప‌దే ప‌దే ఈనాడుతోనే వైర‌మా? జ‌గ‌న్!

ఆయ‌నొక మీడియా సంస్థ‌కు అధినేత.. ఇంకా చెప్పాలంటే ఆయ‌నకు అంగీకారం ఉన్నా లేకపోయినా కొన్ని సంద‌ర్భాల్లో ఈనాడు సపోర్ట్ కూడా  కోరుకున్న నాయ‌కుడు. వైఎస్సార్ త‌రువాత మ‌ళ్లీ అంత‌టి స్థాయిలో ఇన్నాళ్ల‌కు ఈనాడు పేప‌ర్ చూపిస్తూ, సంబంధిత ప్ర‌ధాన వార్త‌లు, శీర్షికలూ చ‌దువుతూ ఓ సీఎం హోదాలో కోపం అయ్యారు జ‌గ‌న్. అదే ఇవాళ్టి ట‌ర్నింగ్ పాయింట్ .. ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంట్ కూడా !

నాలుగు మీడియా సంస్థ‌ల‌పై జ‌గ‌న్ ఇవాళ మ‌ళ్లీ కోపం అయ్యారు. ముఖ్యంగా లీడింగ్ పేప‌ర్.. లార్జెస్ట్ స‌ర్క్యులేటెడ్ పేప‌ర్ ఈనాడు పై  అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో మీడియాపై మ‌రోసారి విరుచుకుపడ్డారు. దీంతో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు అత్యంత
వివాదాస్ప‌దం అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. వివాదం మాట ఎలా ఉన్నా వాస్త‌వాలు ఎవ‌రికి వారు గుర్తించి ప్ర‌భుత్వాన్ని న‌డిపే క్ర‌మాన్ని దిద్దుకుంటే ఇంకా మేలు అన్న‌ది సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల మాట. ఇవేవీ కాకుండా  కేవ‌లం రాత‌ను మాత్రమే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా, ఉద్దేశాల‌ను ప‌రిగ‌ణించ‌కుండా రాస్తున్న‌దంతా అబ‌ద్ధ‌మే అని ఓ ప్ర‌భుత్వాధిప‌తి నిర్ణ‌యించ‌డం త‌ప్పే అని ఇంకొంద‌రు అభిప్రాయం వ్య‌క్తీక‌రిస్తున్నారు.

త‌ప్పో ఒప్పో ఏదో ఒక‌టి మీడియా రాస్తుంది. మీడియా రాయ‌క‌పోతే మాకు ఎలా నిజాలు తెలుస్తాయి అని ఇటీవ‌లే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అనే రెవెన్యూ మినిస్ట‌ర్ ఆస‌క్తిదాయ‌క రీతిలో మాట‌లు వెలువరించారు. అవును! వైఎస్ జ‌గ‌న్  పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కానీ అంత‌కుమునుపు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కానీ ఈనాడు త‌న వంతు బాధ్య‌త‌తోనే వార్త‌లు రాసింది. ఆ విధంగా త‌న వంతు క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌ను పూర్తి చేసింది. ఇప్పుడు కూడా ఆర్థికంగా ఓ రాష్ట్రం బ‌లోపేతం కావాల‌ని కోరుకుంటుందే త‌ప్ప త‌ప్పుడు నిర్ణ‌యాలు వ‌ద్ద‌ని చెబుతుందే త‌ప్ప ! అంత‌కుమించి రాసిందేం లేదు. ఈ నేప‌థ్యంలోనే కొత్త అప్పులు ఇచ్చే స్థితిలో ఆర్బీఐ లేదు అన్న‌ది వాస్త‌వం కాదా ? ఉన్న వాటికే నిధులు స‌ర్ద‌లేక ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ భారం అయిపోతున్న సంద‌ర్భాలే లేవా? వీటిపై అధికార పార్టీ పున‌రాలోచించుకోవాలి… అని హిత‌వు చెబుతుంది టీడీపీ.

ఇవాళ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆ విధంగా మామ బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆద్యంతం ఆయ‌న మీడియాను టార్గెట్ చేశారు. రాక్ష‌సుల‌తో తాను యుద్ధం చేస్తున్నాన‌ని ఓ వ‌ర్గం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఆవిధంగా ఆయ‌న కొత్త యుద్ధం కాదు కానీ పాత యుద్ధానికే కొంత కొన‌సాగింపు ఇచ్చారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ఉద్దేశించి ఇటీవ‌ల ఈనాడులో వ‌స్తున్న క‌థ‌నాలు ఉటంకించారు. రాష్ట్రాన్ని శ్రీ‌లంక‌తో పోల్చి పాపుల‌ర్ మీడియా క‌థ‌నాలు రాయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ విధంగా ఆయ‌న త‌న‌ని తాను స‌మ‌ర్థించుకుని, త‌న నిర్ణ‌యాల‌ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటూ వాటికి కొన్ని మీడియా సంస్థ‌లు వ‌క్ర‌భాష్యం చెబుతున్నాయ‌ని స‌భా ముఖంగా వివ‌రించే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు. 

This post was last modified on April 23, 2022 3:57 pm

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

23 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago