Political News

మేం బుర‌ద రాజకీయాలు చేయం.. జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ఫైర్‌

బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు మీ లాగా బురద రాజకీయాలు చేయడం చేతకాదని ఆయన దుయ్యబట్టారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.., వారిని ఆదుకోవటంలో   ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు.

అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందానన్నారు. రైతులకు అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. బాధ్యత గల పార్టీగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే..వైసీపీ నాయ‌కుల రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు. తమ పార్టీకి బురద రాజకీయాలు చేయటం చేతకాదని దుయ్యబట్టారు. ఇప్ప‌టికైనా రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిదని అన్నారు.

“బురద రాజకీయాలు చేయడం మాకు చేతకాదు. రైతులకు అండగా నిలవడం మా బాధ్యత. రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు అధికారులు చొరవ చూపాలి. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలం. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్య కలిచివేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందా. రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిది.“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఈనెల 23న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నట్లు వెల్లడించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ప‌వ‌న్ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను ప్రారంభించారు. తొలుత ఆయ‌న అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప‌లువురు కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి.. రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. 

This post was last modified on April 21, 2022 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago