Political News

మేం బుర‌ద రాజకీయాలు చేయం.. జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ఫైర్‌

బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు మీ లాగా బురద రాజకీయాలు చేయడం చేతకాదని ఆయన దుయ్యబట్టారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.., వారిని ఆదుకోవటంలో   ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు.

అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందానన్నారు. రైతులకు అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. బాధ్యత గల పార్టీగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే..వైసీపీ నాయ‌కుల రాజకీయ కోణంలో చూడటం దారుణమన్నారు. తమ పార్టీకి బురద రాజకీయాలు చేయటం చేతకాదని దుయ్యబట్టారు. ఇప్ప‌టికైనా రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిదని అన్నారు.

“బురద రాజకీయాలు చేయడం మాకు చేతకాదు. రైతులకు అండగా నిలవడం మా బాధ్యత. రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు అధికారులు చొరవ చూపాలి. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలం. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో రైతుల ఆత్మహత్య కలిచివేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి దిగ్భ్రాంతి చెందా. రైతులకు చేయాల్సిన సాయంపై ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తే మంచిది.“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఈనెల 23న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏలూరు నుంచి చింతలపూడి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నట్లు వెల్లడించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే ప‌వ‌న్ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను ప్రారంభించారు. తొలుత ఆయ‌న అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప‌లువురు కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి.. రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. 

This post was last modified on April 21, 2022 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

2 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

2 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

2 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

3 hours ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

3 hours ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

3 hours ago