Political News

బ్లాక్‌మెయిల్ చేసేవారికే ఏపీలో మంత్రి ప‌ద‌వులు.. చంద్ర‌బాబు

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా స్పందించారు. మంత్రి వ‌ర్గం ఏర్ప‌డి.. దాదాపు వారం అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రియాక్ట్ కాలేదు. అయితే.. తాజాగా స్పందించిన చంద్ర‌బాబు హాట్ కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల్లో బ్లాక్ మెయిల్ చేసిన వారికే.. ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవులు ఇచ్చినట్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యం తాను చెప్ప‌డం లేద‌ని.. వైసీపీలోనే రాజ‌కీయ నాయ‌కులు చెప్పుకొంటున్నార‌ని.. బాబు చెప్పారు.

టీడీపీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్ర‌బాబు.. జగన్ బలహీనత కేబినెట్ కూర్పులోనే తేలిపోయిందని విమర్శించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా అసంతృప్తితోనే ఉందన్నారు. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టమన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం అలుముకుందన్నారు.

నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి రెడ్డి మూడేళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని నిలదీశారు. పింఛన్ ఒకటో తేదీనే ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛను ఇవ్వటంలేదని దుయ్యబట్టారు. ఈనెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

“జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం. జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపం. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా అసంతృప్తితో ఉంది. అపరిచితునిలా మారిన జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం. జగన్ బలహీనత.. కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోంది. వైసీపీలో అసంతృప్తి కేబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడింది. బ్లాక్‌మెయిల్ చేసిన వారికే పదవులు ఇచ్చినట్లు వైసీపీలోనే ప్రచారం జ‌రుగుతోంది” అని అన్నారు.

ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకున్నారని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా ? అని ప్ర‌శ్నించారు. పింఛ‌న్ల‌ను ఒకటో తేదీ ఇస్తున్న‌ట్టు డ‌ప్పు కొన్నార‌న్న చంద్ర‌బాబు.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్‌ ఇవ్వట్లేదన్నారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి హస్తం ఉంద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న మంత్రి అయిన మ‌రునాడే.. ఇక్క‌డ చోరీ జ‌ర‌గ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు. దీనిపై కుక్క‌లు మొరిగాయంటూ.. స్థానిక పోలీసులు చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. నిజాయితీగా, నిక్క‌చ్చిగా విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

This post was last modified on April 18, 2022 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago