నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఒకవైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మరోవైపు మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ సభలు ఒకేసారి ఒకే ప్రాంతంలో జరగటమే. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళద్దరికీ అసలు పడకపోవటమే. ఇద్దరిలో ఎవరుముందు సభ నిర్వహించాలని అనుకున్నారో తెలీదు కానీ నేతల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోయింది.
ఇద్దరికీ కావాల్సిన నేతలు కొందరు ఒకరిని సభ రద్దుకానీ లేదా తేదీ మార్చుకోమని ఇద్దరితోను మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. మంత్రయిన తర్వాత కాకాణి మొదటిసారి జిల్లాకు వస్తున్న కారణంగా ఏర్పాట్లు భారీగా జరిగింది. ఇదే సమయంలో మాజీ అయిన తర్వాత అనీల్ పెట్టుకున్న మొదటిసభ కాబట్టి అందరిలోను ఆసక్తి పెరిగిపోయింది. నేతలు కానీ పోలీసులు కూడా ఎవరి సభకు అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం లేకుండాపోయింది.
అందుకనే మీడియా మొత్తం అనీల్ ది బలనిరూపణ వేదికగానే ప్రచారం చేసింది. అయితే వేర్వేరుగా మాట్లాడిన కాకాణి, అనీల్ ఇద్దరు కూడా పార్టీ గెలుపు, 2024 ఎన్నికల్లో అన్నీస్ధానాల్లో పార్టీని గెలిపించుకోవటం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లాంటి కామన్ అంశాలను మాత్రమే టచ్ చేయటంతో రెండుసభలు ప్రశాంతంగానే ముగిశాయి. అనీల్ మాట్లాడుతు తాను నిర్వహించిన సభ బలనిరూపణ కాదని స్పష్టంగా చెప్పారు. రెండుసార్లు గెలిచిన తాను కొత్తగా బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇదే సమయంలో ఆత్మీయ సమావేశంలో కాకాణి మాట్లాడుతు తన నియోజకవర్గంలో అనీల్ సభ నిర్వహించుకుంటే అది బలప్రదర్శన ఎలాగవుతుందని తేలిగ్గా తీసుకున్నారు. ఇదే సమయంలో జిల్లాలోని నేతలందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో కూడా కచ్చితంగా అన్నీ సీట్లను గెలుచుకుంటామని చెప్పారు. దాంతో ఇద్దరు కూడా ఒకరిపై మరొకరు పరోక్షంగా కూడా ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడ్డారు. బహుశా జగన్ నుండి ఏదైనా సంకేతాలు అందిన కారణంగానేమో ఇద్దరి స్పీచ్ దాదాపు ఒకటిగానే ఉంది. దాంతో జిల్లాలోని నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on April 18, 2022 5:02 pm
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో…