హైదరాబాద్ అభివృద్ధి కావడానికి.. ఐటీ పరిశ్రమ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం టీడీపీ ప్రభుత్వమే.. ఇదీ తరచూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపిన ఘనత తనదేనని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు కాస్త విభిన్నమైన మాటలు మాట్లాడారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ను పొగుడుతూ.. అటు ఏపీ సీఎం జగన్ను విమర్శిస్తూ బాబు వ్యాఖ్యలు చేశారు.
తాజాగా తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించిన ఆయన ఇక్కడి నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పుంజుకునే దిశగా నాయకులు పని చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు గురించి ప్రస్తావించారు. తన హయాంలో తీసుకొచ్చిన విధానాల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని బాబు అన్నారు. అది తనకెంతో సంతృప్తినిస్తుందని చెప్పారు. తన తర్వాత వచ్చిన వాళ్లు అభివృద్ధిని చెడగొట్టలేదు కాబట్టి తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.
అంటే తన తర్వాత ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన దివంగత వైఎస్సార్, ఆ తర్వాత ఇప్పటి సీఎం కేసీఆర్ను బాబు ప్రశంసించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధికి తన హయాంలోనే బీజం పడిందనే అర్థం వచ్చేలా బాబు మాట్లాడారని చెబుతున్నారు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలి ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధిని ప్రస్తుత సీఎం జగన్ చెడగొడుతున్నారనేలా బాబు మాటలున్నాయి. ఏపీలో అభివృద్ధిని చెడగొట్టారు కాబట్టే పతనావస్థకు చేరుకుందని ఆయన అన్నారు. అమరావతి రాజధాని విషయంలో బాబు బాగా హర్ట్ అయ్యారని నిపుణులు అంటున్నారు. జగన్ మూడు రాజధానుల విషయంపై అందుకే ప్రజలతో పాటు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెబుతున్నారు. ఇలా బాబు మొత్తానికి కేసీఆర్ను ప్రశంసిస్తూనే జగన్కు విమర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 16, 2022 3:39 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…