Political News

ఉద్యోగులను రెచ్చగొట్టడమేనా ?

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను రెచ్చగొట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అదేమిటంటే రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవాలట. ఉదయం 10 గంటల్లోపు మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి హాజరు వేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవటం అన్నది ఏ ఇతర శాఖల్లో కూడా లేదు. ఈ బంపరాఫర్ కేవలం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం అందించింది.

శనివారం నుండి అమల్లోకి వచ్చిన కొత్త హాజరు నిబందనతో ఉద్యోగులంతా మండిపోతున్నారు. మూడుసార్లు హాజరువేసుకోవటం ఏమిటంటు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా ఏ శాఖలో ఉద్యోగులైనా ఉదయం 10 గంటలకు తమ ఆఫీసుల్లోకి వచ్చినపుడు అటెండెన్స్ రిజస్టర్లో సంతకాలు పెడతారు. తిరిగి సాయంత్రం 5 గంటలకో తర్వాతో వెళ్ళేటపుడు రిజిస్టర్ లో సంతకాలు చేస్తారంతే. మధ్య మధ్యలో సంతకాలు చేసే అవసరం ఉండదు. ఈ విధానం ఆపీసుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగులతో పాటు ఫీల్డులో తిరిగే వాళ్ళకూ వర్తిస్తుంది.

మరి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కూడా చాలమంది ఫీల్డులో పనిచేస్తుంటారు. కాబట్టి ఉదయం వచ్చి అటెండన్స్ రిజిస్టర్లో సంతకం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటపుడు సచివాలయంకు వచ్చి సంతకం చేసి వెళిపోతారు. అలాంటిది ఇపుడు కొత్త రూల్ ఎందుకు తెచ్చారంటు ఉద్యోగులు మండిపోతున్నారు. ఇప్పటికే తమ ప్రొబేషన్ కన్ఫర్మ్ కాకపోవటంతో ప్రభుత్వంపై అంతా మండుతున్నారు. మొన్నటి పీఆర్సీ వివాదంలోనే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి సమ్మెచేసిన విషయం తెలిసిందే.

రేపు జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీఇవ్వటంతో వీళ్ళు సమ్మె విరమించారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా మూడుసార్లు హాజరు వేసుకోవాలనే కొత్త నిబంధనపై ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3-5 గంటల మధ్యలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులంతా తప్పకుండా హాజరుకావాలి. కానీ ఫీల్డ్ వర్క్ పేరుతో చాలామంది హాజరుకావటంలేదట. అందుకనే మూడుసార్ల హాజరు అనే విధానాన్ని తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరి కొత్త నిబంధన ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on April 16, 2022 10:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

39 minutes ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

2 hours ago

విజయ్ విజయమే.. మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే?

తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్‌లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…

2 hours ago

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

3 hours ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

3 hours ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

3 hours ago