Political News

సుప్రీం బోనులో జ‌గ‌న్ ! ఈ సారీ నిరాశే !

ఏపీ స‌ర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభాల‌ను చ‌వి చూస్తోంది. అయినా కూడా మొండి ధైర్యంతో వెళ్తోంది. ముఖ్యంగా నిధులు లేక కొన్ని చోట్ల కొన్ని ప‌నులు నిలిపివేసింది. కొన్ని చోట్ల అత్యవ‌స‌రం అనుకుని ఖ‌ర్చు చేయాల్సిన నిధులను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తోంది. ఆ మ‌ధ్య ఉపాధి నిధుల‌ను ఇలానే ప‌క్క‌దోవ ప‌ట్టించి అభాసుపాలైంది. అప్ప‌ట్లో కోర్టు జోక్యంతో నిధుల మ‌ళ్లింపు ఆగింది. ఆ త‌రువాత ఉద్యోగుల భ‌విష్య నిధి ఖాతాలోని నిధులు వాడుకుని త‌రువాత మ‌ళ్లీ కోర్టు జోక్యంతో వాటిని వెన‌క్కు మ‌ళ్లించి వెనువెంట‌నే త‌ప్పు దిద్దుకుంది.

ఈ సారి అత్య‌వ‌స‌ర స‌మయాల్లో విపత్తుల వేళ ఖ‌ర్చు చేయాల్సిన నిధులు క‌రోనా బాధితుల‌కు చెల్లించేందుకు స‌మాయ‌త్త‌మై సుప్రీంలో న‌వ్వుల పాలైంది. ఓ పిటిష‌న‌ర్ కార‌ణంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. వాస్త‌వానికి క‌రోనా బాధితుల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త అటు కేంద్రానికీ ఉంది. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వానికీ ఉంది. సంయుక్త భాగ‌స్వామ్యంతో చేయాల్సిన సాయానికి కేంద్రం పెద్ద‌గా ఇచ్చింది లేదు అని తేలిపోయింది.

ఇదే విష‌యం కోర్టులో కూడా ఒప్పుకుంది. పార్ల‌మెంట్ లో కూడా ఒప్పుకుంది. తామే అప్పుల‌తో నెట్టుకు వ‌స్తున్నామ‌ని క‌నుక ఈ ద‌శ‌లో త‌మ సాయం పెద్ద‌గా ఉండ‌ద‌ని కూడా చెప్పి ఓ యాభై వేల రూపాయ‌ల వ‌ర‌కూ మాత్రమే సంబంధిత కుటుంబాల‌కు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది.


అంతేకాకుండా బాధిత కుటుంబాల‌కు నెల‌కు రెండు వేల రూపాయ‌ల చొప్పున పింఛ‌ను ఇచ్చేందుకు కూడా స‌మ్మ‌తించింది. ఇవి కూడా ఇంకా తేల‌నే లేదు. వీటిలో కూడా ఇంకా అమలు అన్న‌ది అనుమానాల‌కు సంబంధించే ఉన్నాయి. కానీ ఆ ద‌శ‌లో కేంద్రం చేయ‌కుండా ఉంటే రాష్ట్రాల‌యినా స‌రే మాన‌వ‌త‌ను చాటుకోవాల‌ని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయ‌మే కాకుండా అర్హుల‌యిన వారికి ఉపాధి మార్గాలు వీలున్నంత వ‌ర‌కూ చూపాల‌ని కూడా చెప్పింది.ఇదే స‌మ‌యంలో ఏపీ కూడా కోర్టుకు చిక్కింది. అప్ప‌ట్లో క‌రోనా బాధితుల‌కు ప‌రిహారం చెల్లించ‌క కోర్టుకు చిక్కింది. దాంతో ఆఘ‌మేఘాల మీద నివార‌ణ చ‌ర్య‌ల‌కు అధికారులు స‌మ‌యాత్తం అయితే ఇప్పుడు అది కూడా మ‌రో వివాదానికి తావివ్వ‌డం విచార‌క‌రం.

ఇంకా చెప్పాలంటే…
క‌రోనా మ‌ర‌ణాల‌కు సంబంధించి ఇప్ప‌టికీ చాలా మందికి ప‌రిహారం అంద‌ని దాఖలాలే ఉన్నాయి. కోర్టుల జోక్యంతో కొన్ని చోట్ల ప‌రిష్కారం అయిన సంద‌ర్భాలు ఉంటే కొన్ని చోట్ల కాని సంద‌ర్భాలే అనేకం. అయినా కూడా అధికారుల త‌ర‌ఫున వారికి ద‌క్కుతున్న న్యాయం కూడా అంతంత మాత్ర‌మే అన్న‌ది తేలిపోయింది. వాస్త‌వానికి మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆదుకోవాల్సిన పాల‌క వ‌ర్గానికి చెందిన వారంతా ప‌క్క చూపులు చూడ‌డమే ఇందుకు కార‌ణం అని నిర్థార‌ణ అవుతోంది. ఈ ద‌శ‌లో బాధిత వ‌ర్గం త‌ర‌ఫున మ‌రోసారి గొంతెత్త‌డం బాధ్య‌త.

ఇదే స‌మ‌యంలో నిధులకు సంబంధించి కేటాయింపు కూడా ఓ బాధ్య‌త. కానీ ఏపీ స‌ర్కారు స‌రైన రీతిలో నిధులు లేనందున త‌ప్పిదాలు చేస్తోంద‌ని తెలుస్తోంది. నిబంధ‌న‌ల‌ను తోసిరాజ‌ని వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మ‌రోసారి అత్యున్న‌త న్యాయ స్థానంలో చుక్కెదురు అయింది. నిధుల మ‌ళ్లింపు విష‌య‌మై సుప్రీం కోర్టు సీరియ‌స్ అయింది. విపత్తు నిర్వ‌హ‌ణ నిధులు మ‌ళ్లించ‌రాద‌ని ప్ర‌భుత్వానికి కోర్టు మొట్టికాయ‌లు వేసింది. నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) ను మ‌రో విష‌య‌మై వాడ‌కూడ‌ద‌ని కూడా చెప్పింది. దీంతో బాధితుల‌కు ప‌రిహారం ఇప్పుడెలా చెల్లించాలో తెలియ‌ని మ‌క‌తిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ది.

This post was last modified on April 14, 2022 10:11 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago