Political News

వెంట్రుక పీక‌లేద‌న్న‌ది.. వాళ్ల నేత‌ల‌నే.. జ‌గ‌న్‌పై జేసీ కామెంట్స్‌

త‌న వెంట్రుక కూడా పీకలేరన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. ప్ర‌తిప‌క్షాలను ఉద్దేశించి చేసిన‌వి కావ‌ని.. అవి వైసీపీ ఎమ్మెల్యే లను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ నేత తాడిప‌త్రి మునిసిపాలిటీ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా.. ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన సీఎం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పవన్‌ పర్యటనపై జేసీ ప్రభాకర్రెడ్డి స్పందిచారు. కౌలురైతులకు పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను మేలుకొలిపే కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కోరారు. అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు. ఇక‌, వైసీపీ ప్రభుత్వ ఉచితాలకు మోసపోవద్దని ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

గత ఎన్నికలకు ముందు అన్నీ ఉచితమని వైసీపీ చెప్పిన మాటలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. సామాన్య ప్రజలను బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కొత్త రూల్స్‌ అమలు చేసి తీవ్ర అవస్థలకు గురిచేయడం సరికాదని అన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు జిల్లాకు పర్యటనకు వస్తే, బాధిత రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం కొంత డబ్బు జమ చేసిందని తెలిపారు. పవన్‌ ప్రశ్నిస్తేనే మీరు బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరిని మార్చుకొని, బాధితరైతు కుటుంబాలకు ఆర్థికం సాయం చేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

This post was last modified on April 14, 2022 7:58 am

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

9 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago