Political News

జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేస్తా.. మ‌న‌సు విప్పేసిన మంత్రిగారు!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన మంత్రివ‌ర్గంలో ఒక్కొక్క మంత్రి త‌మ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు. ముహూర్తం .. వ‌ర్జ్యం.. ఇలా అన్నీ చూసుకుని త‌మ త‌మ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు. అయితే.. ఇలా బాధ్య‌త‌లు తీసుకుంటున్న‌వారు..తమ మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను దాచుకోలేక పోతున్నారు. వెంట‌నే బ‌య‌ట పెట్టేస్తున్నారు. ఎవ‌రు ఏమ‌నుకుంటారో..అనే బాధ కూడా లేకుండా.. ఎలాంటి మొహ‌మాటానికీ తావివ్వ‌ని విధంగా.. సీఎం జ‌గ‌న్‌కు భ‌జ‌న చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న స‌మాచార శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. చెల్లుబోయిన వేణు.. సీఎం జ‌గ‌న్‌ను ఆరాతీయ‌కండి.. ఆరాధించండి.. అప్పుడు అంద‌రిప‌నులు నెర‌వేరుతాయ‌ని.. స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శించారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా.. సీనియ‌ర్ నేత‌, జ‌గ‌న్ 2.0లో మంత్రిగా అవ‌కాశం చిక్కించుకున్న ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు కూడా రెవెన్యూ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కూడా నోరు జారిపోయారు. త‌న‌కంటూ.. ఎలాంటి ల‌క్ష్యాలు లేవ‌ని.. తూచ‌. త‌ప్ప‌కుండా.. జ‌గ‌న్ చెప్పింది చేయ‌డ‌మే.. త‌న డ్యూటీ అని చెప్పేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఇప్ప‌టికే విప‌క్షాలు.. ఎంత మంది మంత్రులున్నా.. ఎన్ని సామాజిక వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇచ్చినా.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నార‌ని.. విమ‌ర్శ‌లు గుపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ధ‌ర్మాన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం ద‌క్కించుకున్నాయి.

గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. అయిన‌ప్ప‌టికీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవని ధ‌ర్మాన అన్నారు. సీఎం జగన్ నిర్దేశించిన‌ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. “రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్‌ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని” మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

This post was last modified on April 13, 2022 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

1 hour ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

3 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

5 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago