Political News

మొదలుకానున్న భరోసా యాత్ర

ఈ మద్యనే చెప్పినట్లు జనసేన అధినేత కౌలు రైతుల కోసం భరోసా యాత్ర మొదలు పెడుతున్నారు. తన యాత్రను పవన్ అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు నుంచి మంగళవారం ప్రారంభిస్తున్నారు. తన యాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందించబోతున్నారు. అలాగే కొత్త చెరువులోని కౌలు రైతులతో గ్రామ సభ కూడా నిర్వహిస్తారు.

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించబోతున్నట్లు పవన్ ఈ మధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ అప్పట్లో చెప్పినట్లు అనంతపురం, కర్నూలులో సుమారు 230 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళందరి కుటుంబాలను పరామర్శించటమంటే ఒక విధంగా రాజకీయ యాత్రనే చెప్పాలి. ఎందుకంటే కౌలు రైతుల భరోసా యాత్రంటే ఇది ఫక్తు రాజకీయ కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు.

ఏదో పేరుతో జనాల్లో ఉండటమే పవన్ వ్యూహం. సరే కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటమంటే వాళ్ళని ఎంతోకొంత ఆదుకోవటంగానే చూడాలి. అంటే పవన్ కోణంలో రాజకీయ కార్యక్రమమే అయినా కౌలు రైతుల కుటుంబాల కోణంలో చూస్తే మంచి కార్యక్రమమే అనటంలో సందేహం లేదు. చనిపోయిన కౌలు రైతులు రెండు జిల్లాల్లోను ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి రెండు జిల్లాలను పవన్ కవర్ చేసినట్లుంటుంది.

ఎలాగూ షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది రెండేళ్ళు మాత్రమే. ఈలోగా ఏదో కారణంతో జనాల్లో ఉండేట్లుగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై స్పందన పేరుతో జనసేన నేతలు+శ్రేణులు జనాల్లో తిరుగుతున్నారు. వివిధ అంశాలను తీసుకుని పార్టీ నేతలు రెగ్యులర్ గా జనాల దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీకట్లో బాణం వేసినట్లు కాకుండా రాబోయే ఎన్నికలను పవన్ సీరియస్ గా తీసుకున్నట్లే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఏదో గాలివాటుగా అక్కడక్కడ బహిరంగ సభలు నిర్వహించేసి ఎన్నికల్లో పోటీ చేశారు. దాని ఫలితమే తల బొప్పి కట్టడం. అందుకనే ఇపుడు కాస్త ప్లానుతో వెళుతున్నారు.

This post was last modified on April 12, 2022 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజ్ఞానంద్ చెస్ మాస్టర్స్ ఛాంపియన్… గుకేశ్‌పై ఘన విజయం!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…

51 minutes ago

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

1 hour ago

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

2 hours ago

‘పులిరాజు’ ఫోటో వెనుక అసలు కథ

ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…

2 hours ago

అరవింద్ మాటల్లో అర్థముందా అపార్థముందా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…

2 hours ago

బాలయ్యకు తిరుగు లేదు… ‘హిందూపురం’పై టీడీపీ జెండా

టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…

2 hours ago