AP CM YS Jagan Pressmeet
కొత్తమంత్రివర్గంలో బలహీనవర్గాలకు ప్రత్యేకించి బీసీ సామాజికవర్గానికి పెద్ద పీటవేయాలని జగన్మోహన్ రెడ్డి దాదాపు డిసైడ్ అయ్యారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో బలహీనవర్గాలకు చెందిన వారి శాతం 56 ఉండేది. అంటే అగ్రవర్ణాల వారి శాతం 44 కి జగన్ పరిమితం చేసేశారు. అయితే కొత్తగా కొలువుతీరబోయే మంత్రివర్గంలో అగ్రవర్ణాల శాతాన్ని మరింత కుదించేయబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త మంత్రివర్గంలో బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిల వాటాను సుమారు 60 శాతానికి తీసుకెళ్ళాలని జగన్ డిసైడ్ చేశారట. జగన్ తాజా నిర్ణయంలో రెండు పాయింట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిదేమిటంటే బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆ సామాజికవర్గాలను వీలైనంతగా ఆకర్షించటం. ఇక అగ్రవర్ణాలు అంటే సొంత సామాజికవర్గంతో పాటు కాపుల వాటాను వీలైనంత తగ్గించటం.
ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీకి మొదటినుండి మద్దతుగా నిలుస్తున్న బీసీలను వీలైనంతగా ఆకట్టుకోవాలనే టార్గెట్ తో జగన్ పావులు కదుపుతున్నారు. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నపటినుండి బీసీలకు ప్రాధాన్యతిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్లలో రాయలసీమలో అత్యధికం బీసీలకే కేటాయించి మంచి ఫలితాన్ని కూడా పొందరు. రేపటి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా లాభపడాలన్నదే జగన్ ఆలోచన. అందుకనే గతంలో ఎప్పుడు లేనంతగా మంత్రివర్గంలో బీసీల వాటా బాగా పెరగబోతోంది.
జగన్ ప్లాన్ సక్సెస్ అయితే టీడీపీ మీద పెద్ద దెబ్బ పడటం ఖాయమనే చెప్పాలి. మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లోనే ఈ విషయం రుజువైంది. రేపటి సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే రిపీటైతే టీడీపీ పనిగోవిందానే. కొత్త క్యాబినెట్ నూరుశాతం ఎన్నికల క్యాబినెట్ అనటంటలో సందేహంలేదు. ఏ రాజకీయ నేత ఏమి చేసినా ఓట్లరూపంలో లబ్దిపొందేందుకే కదా. జగన్ కూడా ఇదే పద్దతిలో ఆలోచించి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే ఏకైక ధ్యేయంగా పెట్టుకున్న జగన్ అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ ప్లాన్లు వర్కవుటవుతాయా ? అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.
This post was last modified on April 10, 2022 6:23 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…