Political News

ఏపీ కొత్త కేబినెట్ తుది జాబితా ఇదే.. క‌స‌ర‌త్తు పూర్తి..

మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు పూర్తయింది. గత మూడు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పలు దఫాలుగా చర్చించిన సీఎం.. ఈరోజు కూడా సమావేశమయ్యారు. సీఎం జగన్తో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌ కూర్పుపై సీఎం కసరత్తు ముగిసినట్లు చెప్పారు. సామాజిక సమతుల్యత ఉండేలా నూతన మంత్రివర్గ కూర్పు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల మేరకు కొత్త మంత్రివర్గం ఉంటుందన్నారు.

అయితే.. మంత్రి వ‌ర్గ జాబితాకు సంబంధించి.. తాజాగా.. తుది కూర్పు జాబితా మీడియాకు అందింది. దీని లో కీల‌క మంత్రుల కొన‌సాగింపుతోపాటు..కొత్త‌వారికి కూడా చోటు క‌ల్పించారు. సామాజిక, ప్రాంతాల సమీకర ణాల మేరకు మంత్రివర్గ కూర్పు. సామాజిక సమతుల్యత ఉండేలా మంత్రివర్గం ఉంది. సాయంత్రం 6 గంట‌ల‌కు సీల్డ్‌ కవర్‌ను గవర్నర్‌కు పంపుతారు. అయితే.. ఇంత‌లోనే కొంద‌రికి ఫోన్లు వ‌చ్చాయి.

సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని కోరారు. రేపటి కార్యక్రమం షెడ్యూ ల్‌ను కొత్త మంత్రులకు జీఏడీ పంపనుంది. నెల్లూరులో కాకాని గోవర్ధన్‌రెడ్డి ఇంటి దగ్గర సంబరాలు చేసు కుంటున్నారు.

కొత్త మంత్రులు వీరే

విజయనగరం జిల్లా నుంచి బొత్స స‌త్యనారాయ‌ణ‌, రాజన్నదొర
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు
విశాఖ జిల్లా నుంచి భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్‌
తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, కొండేటి చిట్టి బాబు, వేణుగోపాల కృష్ణ
పశ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్‌
కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి
గుంటూరు జిల్లా నుంచి విడదల రజనీ, మేరుగ నాగార్జున
ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌
నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్దన్ రెడ్డి
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప జిల్లా నుంచి అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాసులు.
క‌ర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం
అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ

This post was last modified on April 10, 2022 6:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

46 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago