అప్పుడప్పుడూ మరక మంచిదే! అప్పుడప్పుడూ మార్పు కూడా మంచిదే ! ఆ కోవలో ఆ తోవలో మంత్రి పేర్ని నాని ఉన్నారు.తన తప్పు ఏమయినా ఉంటే మనఃస్ఫూర్తిగా క్షమించండి అని వేడుకోవడం ఇవాళ్టి పరిణామంలో కొసమెరుపు. ఆ వివరం ఈ కథనంలో…! త్వరలో మంత్రి వర్గ విస్తరణ కానుంది. అందుకు ముహూర్తం కూడా నిర్థారణ అయింది. ఈ సమయంలో ఒక్కో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలకు, అస్సలు పొంతన లేని జవాబులకు, బూతులకు చిరునామాగా నిలిచిన మంత్రులంతా ఇప్పుడు పునరాలోచనలో పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ మూడేళ్ల కాలాన్ని పునః సమీక్ష చేసుకుంటున్నారు. మంత్రిగా తొలిసారి అవకాశం దక్కిన పేర్ని నాని అయితే ఇంకా పునరాలోచనలో పడిపోయారు కూడా !
రేపటి నుంచి తన నడవడి సంబంధిత ప్రణాళిక ఏంటన్నది కూడా ఓ విధంగా అయోమయంలో ఉంది. ఏం చేస్తే రాజకీయంగా ఎదిగి వస్తాను అన్న ఆలోచన కూడా ఆయనకు అందడం లేదు. రవాణా శాఖతో పాటు సమాచార శాఖను కూడా నిర్వహించారు. యువ ముఖ్యమంత్రి విశ్వసించిన వారిలో వీర విధేయుడిగా ఉన్నారు. ఓ విధంగా బాహుబలి క్యాబినెట్ లో కట్టప్ప ఎవరంటే మొదటి వరుసలో నిల్చొంటారు నాని. ఆ తరువాతే ఆళ్ల నాని కానీ కొడాలి నాని కానీ! అంతటి ప్రేమ మరియు విశ్వాసాన్నీ ప్రకటించారాయన.
తనకు అప్పగించిన పనులతో పాటు కొన్ని అదనపు బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆఖరు నిమిషంలో బాధ్యతలు అందుకోమన్నా అందుకున్ని భీమ్లా నాయక్ సమయంలో వివాదాస్పద జీఓ అమలుకు ఎంతో కృషి చేశారాయన. ఆ సమయంలో పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కూడా ! అయినా సరే జగన్ ఆదేశాలను తు.చ.తప్పక పాటించిన ఏకైక మంత్రిగా పేరుంది. తాజాగా ఆయన పదవీచ్యితుడు కానున్నారు.
ఈ నెల 11 న కొత్త మంత్రివర్గంలో పాతవారెవ్వరూ దాదాపుగా ఉండరు. బొత్స బెర్త్ కూడా డౌటే ! ఒకవేళ పాతవాళ్లు ఉన్నా కూడా కొత్తవాడయిన పేర్ని నానికి మాత్రం ఉద్వాసన తప్పదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రయివేట్ బస్ ఆపరేటర్స్ తో ఆయన సమావేశం అయ్యారు.తాను పదవిలో ఉన్నా లేకపోయినా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి, ఆఖరులో తాను ఏమయినా ఎక్కువ, తక్కువ లు మాట్లాడితే క్షమించమని అడిగారు.
This post was last modified on April 5, 2022 9:07 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…