Political News

బీజేపీకి విరాళం.. 720 కోట్లు.. మోడీ కోసం ఎవ‌రిచ్చారంటే?

దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు అంద‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. కొన్నాళ్లుగా మోడీ.. కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అయితే.. తాము పేద‌ల కోసం.. ఈ దేశం కోసం ప‌నిచేస్తున్నామ‌ని… బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ.. తాజాగా అందిన విరాళాల‌ను బ‌ట్టి.. మోడీ ఎవ‌రి కోసం ప‌నిచేస్తున్నారో.. తెలిసిపోయింద‌ని.. జాతీయ పార్టీల నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు.

జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. 2017-18 నుంచి 2018-19 ఏడాదికి కార్పొరేట్ల విరాళాలు 109 శాతానికి పెరిగాయని పేర్కొంది.

2019-20 ఏడాదికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.133.04కోట్లు, ఎన్సీపీకి రూ.57.086 కోట్లుగా ఉన్నాయి. కాగా.. సీపీఎంకు ఎలాంటి కార్పొరేట్ ఫండ్స్ రాలేదని ఏడీఆర్ వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల గురించి భారత ఎన్నికల కమిషన్‌కు జాతీయ పార్టీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఏడీఆర్ తెలిపింది. ఇందులో ప్రధానంగా ఐదు జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సీపీఎంలు ఉన్నాయి.

5 జాతీయ పార్టీల్లో బీజేపీ 2,025 కార్పొరేట్‌ దాతల నుంచి రూ.720.40 కోట్ల విరాళాలు పొందింది. కాంగ్రెస్‌ 154 కార్పొరేట్‌ దాతల నుంచి రూ.133.04 కోట్లు, ఎన్సీపీ 36 కార్పొరేట్‌ దాతల నుంచి రూ.57.08 కోట్ల విరాళాలు అందుకున్నాయి. కార్పొరేట్‌ విరాళాల ద్వారా ఎలాంటి ఆదాయం సమకూరలేదని సీపీఎం ప్రకటించింది. అయితే.. ఈ వివ‌రాల‌పై కాంగ్రెస్ నేత‌లు.. స‌హా ఇత‌ర పార్టీల నేత‌లు.. మౌనంగా ఉన్నారు. కానీ, బీజేపీపై మాత్రం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మోడీ ప్ర‌భుత్వం కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా ఉంద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి.

This post was last modified on April 5, 2022 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

23 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

42 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

54 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago