Political News

రేవంత్ ప్ర‌త్య‌ర్థుల‌కు అదిరిపోయే షాక్

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో అసంతృప్తులు, అంతర్గత క‌లహాల‌తో తెలంగాణ‌ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయం క్రేజీగా మారిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిపై పార్టీ సీనియ‌ర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్‌‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టి కూడా రేవంత్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. లాయలిస్టుల ఫోరం పేరుతో పార్టీ సీనియర్లు పలుమార్లు భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో మీటింగ్‌‌లు కూడా జరిగాయి. అయితే, దీనికి చెక్ పెట్టేలా రాహుల్‌‌ గాంధీతో రాష్ట్ర నేతలు ఢిల్లీలో సోమవారం భేటీ కానున్నారు. ఈ స‌మావేశానికి ముందే సీనియ‌ర్ల‌కు షాక్ త‌గిలింద‌ని అంటున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌‌కు పీసీసీ నేతలతో పాటు పది మంది మాజీ మంత్రులు, సీనియర్లకు పిలుపు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మార్చి 30న జరిగిన మీటింగ్‌‌లో పార్టీ సభ్యత్వాలపై మాత్రమే చర్చ జరగ్గా.. ఈసారి పార్టీలో అసంతృప్తులు, భవిష్యత్ కార్యాచరణ, కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ బలాబలాలు, లీడర్ల పనితీరు, జనంలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు స‌వివ‌రంగా భేటీ అవ‌నున్న‌ట్లు చెప్తున్నారు.

అయితే, పీసీసీ ర‌థ‌సార‌థి రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఉన్న సీనియ‌ర్ల‌కు ప‌రోక్షంగా రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న శాసన సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పనితీరు ఆధారంగానే ఈ సారి టికెట్లు కేటాయిస్తామని, పనిచేయకుండా.. లాయల్టీ, సీనియరిటీ అంటే కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక‌వేళ ఇదే ఫార్ములాను తెలంగాణ‌లో కూడా అమ‌లు చేస్తే, పార్టీలోని సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టిన‌ట్లేన‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

This post was last modified on April 3, 2022 4:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

2 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

2 hours ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

5 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

5 hours ago