Political News

జగన్ పాలనలో బాదుడే బాదుడు…లోకేశ్

ఏపీలో విద్యుత్ చార్జీల‌ు పెంచుతూ జగన్ సర్కార్ జనంపై మరో బాదుడుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కరోనా కాటు నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న జనం నడ్డి విరిచేలా కరెంటు బిల్లులు పెంచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా లోకేశ్ వినూత్న రీతిలో నిర‌స‌న‌కు దిగారు.

లాంత‌రు చేత‌బ‌ట్టుకుని మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వచ్చిన లోకేశ్…జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌పై ప్రభుత్వం మోయ‌లేని భారం మోపిందని లోకేశ్ ఆరోపించారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలపై జగన్ అధిక‌భారం మోపారని గతంలో ఎన్న‌డూలేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారని లోకేశ్ మండిపడ్డారు. ఉగాది రోజు జగన్ మ‌రో మోస‌పూరిత ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెచ్చారని ఎద్దేవా చేశారు.

ట్రూ ఆప్ అంటూ అనేక పేర్ల‌తో విద్యుత్ చార్జీలు పెంచి డ‌బ్బు లాగేశారని లోకేశ్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు విజనరీ ఆలోచనలతో రాష్ట్రాన్ని వెలుగుల వైపునకు తీసుకువెళ్లారని, కానీ, ప్రిజ‌న‌రీ ఆలోచ‌న‌ల‌తోనే జ‌గ‌న్ జ‌నంపై విద్యుత్ చార్జీల భారం మోపి చీకట్లలోకి నెట్టేస్తున్నారని సెటైర్లు వేశారు. ఇకనైనా…క‌క్ష‌సాధింపులు మాని పాల‌న‌పై జగన్ దృష్టి పెట్టాలని సూచించారు.

విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని, చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చెత్త పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మార్చేసారని చురకలంటించారు. పేద ప్రజల నడ్డి విరిచేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

1 hour ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago