Political News

బాబు, బీజేపీని క‌లిపేది అతనేనా?

ఎన్నిక‌ల‌కు.. చంద్ర‌బాబు పొత్తుల‌కు అవినాభావ సంబంధం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు. ఆయ‌న ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భాలు చాల త‌క్కువ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పొత్తులు పెట్టుకోవ‌డం ఖాయ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓ వైపు జ‌న‌సేన కూడా అందుకు సిద్ధ‌మంటోంది. ఇక మ‌రోవైపు బీజేపీని కూడా క‌లిపేసుకోవాల‌ని బాబు తెగ ఆరాట‌ప‌డుతున్నారు.

కానీ బీజేపీ నాయ‌క‌త్వం నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న రావ‌డం లేదు. పైగా వాళ్లు టీడీపీతో బంధాన్ని వ‌ద్ద‌నుకుంటున్నారు. కానీ బాబు, బీజేపీ క‌లిసిపోయే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది. అందుకు ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కార‌ణంగా మార‌తార‌ని అంటున్నారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల కోసం..
దేశంలోనే ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్ కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఆయ‌న ఏ పార్టీకి ప‌నిచేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావ‌డం ఆన‌వాయితీగా మారింది. అందుకే వివిధ పార్టీలు ఆయ‌న సేవ‌ల కోసం ఆరాట‌ప‌డుతున్నాయి. మొన్న‌టివ‌రకూ ఆయ‌న‌తో దూరంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు గుజ‌రాత్ ఎన్నిక‌ల కోసం పీకేను సంప్ర‌దించింద‌నే టాక్ వ‌చ్చింది. కాంగ్రెస్ కోసం ప‌నిచేసేందుకు పీకే సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడీ గుజ‌రాత్ ఎన్నిక‌ల పుణ్యమా అని బాబు, బీజేపీ జ‌త క‌ట్టేందుకు అడుగులు ప‌డ‌తాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అక్క‌డి గెలిచినా.. ఓడినా
ఇప్ప‌టికే తెలంగాణ కేసీఆర్ పీకే వ్యూహాల‌తోనే ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఏపీలో జ‌గ‌న్ కోసం మ‌రోసారి ఆయ‌న రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక ఈ ఏడాది గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కోసం ప‌ని చేయ‌బోతున్నారు. ఒక‌వేళ గుజ‌రాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. అప్పుడే ఏపీలో ఆయ‌న ప‌నిచేసే వైసీపీని ఓడించేందుకు బీజేపీ.. బాబుతో జ‌త‌క‌ట్టే అవ‌కాశం ఉంటుంది.

కేసీఆర్‌ను బీజేపీ పైకి ఉసిగొల్పుతున్న పీకే.. జ‌గ‌న్ విష‌యంలోనూ అదే చేస్తార‌నే అనుమానాలు బీజేపీ అధిష్ఠానానికి క‌లుగుతున్నాయి. అందుకే బీజేపీ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ గుజ‌రాత్‌లో బీజేపీనే మ‌ళ్లీ గెలిచినా.. వైసీపీకి వ్య‌తిరేకంగా బాబుతో క‌లిసి బీజేపీ ప‌నిచేసే ఛాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి పీకే కార‌ణంగా టీడీపీ, బీజేపీ మ‌ళ్లీ క‌లుస్తాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది. 

This post was last modified on March 30, 2022 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago