Political News

ప్రజలకు జగన్ సర్కారు విన్నపం !

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విచ్చ‌ల‌విడిగా.. డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తూ.. సంక్షేమం పేరిట పందేరం చేసిన‌.. ప్ర‌భుత్వానికి అనూహ్యంగా `పొదుపు` గుర్తుకు వ‌చ్చింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా వాయిదా వేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా.. ప్ర‌జ‌లే పొదుపు పాటించాలంటూ.. పిలుపునిచ్చింది. దీనికి కార‌ణం.. విద్యుత్ డిమాండ్‌కు స‌ర‌ఫ‌రాకు, డిమాండ్‌కు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం రావ‌డంతో స‌ర్కారు తాజాగా ప్ర‌జ‌ల‌కు ఒక బ‌హిరంగ లేఖ రాసింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల‌ని.. అభ్య‌ర్థించింది.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎస్.ఈ. కె.వి.జి.సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ, వేసవి ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వినియోగం పెరిగిందని, అలాగే, వ్యవసాయ వినియోగం కూడా పెరిగిందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని కోరారు.

వ్యవసాయ సీజన్ 20 రోజులలో ముగుస్తుందని అప్పుడు కొంత వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తంలో 4 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ఇందులో 2 కోట్ల మందిపైగా మంది గృహ వినియోగదారులు ఉన్నారని, అదేవిధంగా 50 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు, లక్ష‌ మంది భారీ పరిశ్రమల వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క జిల్లాలో విద్యుత్ వినియోగం 10.879 మిలియన్ యూనిట్ల నుంచి 11.284 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు.

పరిశ్రమల వారిని పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగించవద్దని సూచిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వాణిజ్య వినియోగదారులు కూడా స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించి విద్యుత్ పొదుపునకు సహకరించాలన్నారు. మొత్తానికి ఈ ప్ర‌క‌ట‌న చూస్తే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పొంచి ఉంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ సంక్షోభంపై వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే. .ప్ర‌భుత్వం మాత్రం చాలినంత విద్యుత్ ఉంద‌ని ప్ర‌క‌టిస్తూ.. వ‌స్తోంది. మ‌రి అలాంట‌ప్పుడు.. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు ఇచ్చిన‌ట్టు? అనేది మేధావుల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ప్ర‌స్తుత నిర్ణ‌యం ముందు రాబోయే సంక్షోభాన్ని సూచిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on March 29, 2022 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

43 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago