Political News

ప్రజలకు జగన్ సర్కారు విన్నపం !

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విచ్చ‌ల‌విడిగా.. డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తూ.. సంక్షేమం పేరిట పందేరం చేసిన‌.. ప్ర‌భుత్వానికి అనూహ్యంగా `పొదుపు` గుర్తుకు వ‌చ్చింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా వాయిదా వేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా.. ప్ర‌జ‌లే పొదుపు పాటించాలంటూ.. పిలుపునిచ్చింది. దీనికి కార‌ణం.. విద్యుత్ డిమాండ్‌కు స‌ర‌ఫ‌రాకు, డిమాండ్‌కు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం రావ‌డంతో స‌ర్కారు తాజాగా ప్ర‌జ‌ల‌కు ఒక బ‌హిరంగ లేఖ రాసింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల‌ని.. అభ్య‌ర్థించింది.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎస్.ఈ. కె.వి.జి.సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ, వేసవి ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వినియోగం పెరిగిందని, అలాగే, వ్యవసాయ వినియోగం కూడా పెరిగిందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని కోరారు.

వ్యవసాయ సీజన్ 20 రోజులలో ముగుస్తుందని అప్పుడు కొంత వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తంలో 4 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ఇందులో 2 కోట్ల మందిపైగా మంది గృహ వినియోగదారులు ఉన్నారని, అదేవిధంగా 50 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు, లక్ష‌ మంది భారీ పరిశ్రమల వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క జిల్లాలో విద్యుత్ వినియోగం 10.879 మిలియన్ యూనిట్ల నుంచి 11.284 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు.

పరిశ్రమల వారిని పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగించవద్దని సూచిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వాణిజ్య వినియోగదారులు కూడా స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించి విద్యుత్ పొదుపునకు సహకరించాలన్నారు. మొత్తానికి ఈ ప్ర‌క‌ట‌న చూస్తే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పొంచి ఉంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ సంక్షోభంపై వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే. .ప్ర‌భుత్వం మాత్రం చాలినంత విద్యుత్ ఉంద‌ని ప్ర‌క‌టిస్తూ.. వ‌స్తోంది. మ‌రి అలాంట‌ప్పుడు.. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు ఇచ్చిన‌ట్టు? అనేది మేధావుల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ప్ర‌స్తుత నిర్ణ‌యం ముందు రాబోయే సంక్షోభాన్ని సూచిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on March 29, 2022 8:43 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

4 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

6 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

6 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

7 hours ago