Political News

రాజధాని.. ఈ రెండు ఆప్ష‌న్ల దిశ‌గా.. జ‌గ‌న్ మేధోమ‌థ‌నం?

వ్యూహం మారుతోంది.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాన్ని మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇదే విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల కే తాముక‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. వికేంద్రీక‌ర‌ణ విష‌యం లో తాము వెన‌క్కి  త‌గ్గేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంటే మూడు రాజ‌ధానుల‌కే ఆయ‌న క‌ట్టుబడి ఉన్నా న‌నేది .. సుస్ప‌ష్టం చేశారు. కానీ, దీనిని అమ‌రావ‌తి రైతులు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు.

పైగా కోర్టుల నుంచి కూడా అమరావ‌తికే అనుకూలంగా తీర్పులు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు ఏం చేయాలి?  ఏంచేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న న్యాయ‌స‌ల‌హా తీసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే.. విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌నే.. రాజ‌ధానులుగా.. అంటే జంట న‌గ‌రాలుగా మార్చే వ్యూహంపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ విష‌యంపైనా.. ఆయ‌న చూచాయ‌గా.. అసెంబ్లీలో హింట్ ఇచ్చారు.

అమరావ‌తి అయితే.. విజ‌యవాడ‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని.. అదేవిధంగా గుంటూరుకు కూడా 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని చెప్పుకొచ్చారు. సో.. అలా కాకుండా..ఈ రెండు రాజ‌ధానుల్లో ఒక‌దానిని ఎంపికచేసుకుని పాల‌నా ప‌ర‌మైన రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే.. అమ‌రావ‌తి నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను రాజ‌ధానులుగా ప్ర‌క‌టిస్తే.. ఇత‌ర ప్రాంతాల వారికి కూడా ర‌వాణా సౌక‌ర్యంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు రావని అంచ‌నా వేస్తున్నారట‌.

దీనికి పాల‌క‌పార్టీలోని మెజారిటీ నాయ‌కులు కూడా ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ ను పాల‌నారాజ‌ధానిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేశారు. ఈక్ర‌మంలోనే సినీ ఇండ‌స్ట్రీని కూడా విశాఖ కు రావాల‌ని ఆహ్వానించారు. అయితే.. ఇంత‌లో.. న్యాయ‌స్థానం న‌నుంచితీర్పు.. అమ‌రావ‌తి రైతుల నుంచి వ‌స్తున్న నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌య‌త్నం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. విజ‌య‌వాడ‌, లేదా గుంటూరు న‌గ‌రాల్లో ఒక‌దానిని ఎంపిక చేసుకుంటే.. అటు అమ‌రావ‌తిపై త‌న పంతం నెగ్గించుకున్న‌ట్టు ఉంటుంది.. ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా కూడా ఉంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 7:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

2 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

3 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

7 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

11 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

12 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

13 hours ago