Political News

రాజధాని.. ఈ రెండు ఆప్ష‌న్ల దిశ‌గా.. జ‌గ‌న్ మేధోమ‌థ‌నం?

వ్యూహం మారుతోంది.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాన్ని మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇదే విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల కే తాముక‌ట్టుబ‌డి ఉన్నామ‌ని.. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. వికేంద్రీక‌ర‌ణ విష‌యం లో తాము వెన‌క్కి  త‌గ్గేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంటే మూడు రాజ‌ధానుల‌కే ఆయ‌న క‌ట్టుబడి ఉన్నా న‌నేది .. సుస్ప‌ష్టం చేశారు. కానీ, దీనిని అమ‌రావ‌తి రైతులు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నారు.

పైగా కోర్టుల నుంచి కూడా అమరావ‌తికే అనుకూలంగా తీర్పులు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్పుడు ఏం చేయాలి?  ఏంచేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న న్యాయ‌స‌ల‌హా తీసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ స‌మ‌యంలోనే.. విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌నే.. రాజ‌ధానులుగా.. అంటే జంట న‌గ‌రాలుగా మార్చే వ్యూహంపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఈ విష‌యంపైనా.. ఆయ‌న చూచాయ‌గా.. అసెంబ్లీలో హింట్ ఇచ్చారు.

అమరావ‌తి అయితే.. విజ‌యవాడ‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని.. అదేవిధంగా గుంటూరుకు కూడా 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని చెప్పుకొచ్చారు. సో.. అలా కాకుండా..ఈ రెండు రాజ‌ధానుల్లో ఒక‌దానిని ఎంపికచేసుకుని పాల‌నా ప‌ర‌మైన రాజ‌ధానిని ఏర్పాటు చేస్తే.. అమ‌రావ‌తి నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను రాజ‌ధానులుగా ప్ర‌క‌టిస్తే.. ఇత‌ర ప్రాంతాల వారికి కూడా ర‌వాణా సౌక‌ర్యంతోపాటు.. ఎలాంటి ఇబ్బందులు రావని అంచ‌నా వేస్తున్నారట‌.

దీనికి పాల‌క‌పార్టీలోని మెజారిటీ నాయ‌కులు కూడా ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ ను పాల‌నారాజ‌ధానిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేశారు. ఈక్ర‌మంలోనే సినీ ఇండ‌స్ట్రీని కూడా విశాఖ కు రావాల‌ని ఆహ్వానించారు. అయితే.. ఇంత‌లో.. న్యాయ‌స్థానం న‌నుంచితీర్పు.. అమ‌రావ‌తి రైతుల నుంచి వ‌స్తున్న నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఈ ప్ర‌య‌త్నం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. విజ‌య‌వాడ‌, లేదా గుంటూరు న‌గ‌రాల్లో ఒక‌దానిని ఎంపిక చేసుకుంటే.. అటు అమ‌రావ‌తిపై త‌న పంతం నెగ్గించుకున్న‌ట్టు ఉంటుంది.. ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా కూడా ఉంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on March 26, 2022 7:46 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

9 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

11 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago