Political News

మద్యంపై జ‌గ‌న్మాయ‌.. ఎవ‌రిని ఎవ‌రు మోసం చేస్తున్నారు?

రాష్ట్రం మ‌ద్యం విష‌యం.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో పెద్ద ఎత్తున కుదిపివేసిన విష‌యం తెలిసిందే. క‌ల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పెద్ద ఎత్తున విజృంభించిన విష‌యం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ, శాస‌న మండ‌లిలోనూ.. దీనిపై చ‌ర్చ‌కు టీడీపీ ప‌ట్టుబ‌ట్డింది. కానీ, వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగి.. స‌స్పెన్ష‌న్ ప‌ర్వానికి తెర‌దీసిం ది. స‌రే.. ఇది జ‌రిగిపోయిన గ‌తం. కానీ, ఈ సంద‌ర్భంగా స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడిన వ్యాఖ్య‌లపై మాత్రం ప్ర‌జాక్షేత్రంలో ఇప్ప‌టికీ.. చ‌ర్చ సాగుతోంది.

జే బ్రాండ్స్ అంటూ.. టీడీపీ ఏదైతే.. ప్ర‌చారం చేస్తోందో.. వాటిని తాను తీసుకురాలేద‌ని.. దాదాపు 234 ర‌కా ల బ్రాండ్ల‌ను గ‌త టీడీపీ ప్ర‌భుత్వ‌మే తీసుకువ‌చ్చింద‌ని.. జ‌గ‌న్ చెప్పారు. దీనిలో త‌మ ప్ర‌మేయం ఏమీలే ద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆరు మాసాల్లో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని తీసుకువ చ్చి.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుకుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, అదేస‌మ‌యంలో అసలు త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. బార్ వ్య‌వ‌స్థ‌ను తీసేయాల‌ని అనుకున్నామ‌ని అన్నారు.

కానీ, అప్ప‌టికి చంద్ర‌బాబు దిగిపోతూ.. దిగిపోతూ.. బార్ల‌కు ఐదేళ్ల‌పాటు లైసెన్సులు రెన్యువ‌ల్ చేశార‌ని.. దీంతోనే ప్ర‌జ‌ల‌కు మ‌ద్యం అందుబాటులోకి వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ రెండు విష‌యాల‌పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వ‌ర‌కు దృష్టి పెట్టారు. నిజ‌మే.. చంద్ర‌బాబు చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని దాదాపు 234 ర‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని అనుకుందాం. మ‌రి ప్ర‌జాప్ర‌భుత్వంగా.. రాజ‌న్న‌ రాజ్యాన్ని స్థాపిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఆ నిర్ణ‌యాన్ని ఎందుకు ర‌ద్దు చేయ‌లేదు? అనేది ప్ర‌ధాన డిమాండ్‌.

ఎలాంటి అనుమ‌తి లేద‌ని.. పేర్కొంటూ.. దాదాపు 8 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల్చేసిన‌.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు హాని చేస్తుంద‌ని.. తెలిసి కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించిన(జ‌గ‌న్ చెప్పిన‌ట్టు) చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని ఎందుకు ఉప‌సంహ‌రించ‌లేదు.?  అదేస‌మ‌యంలో మంచి బ్రాండ్ల మ‌ద్యాన్ని ఎందుకు క‌ట్ట‌డి చేసిన‌ట్టు? అనేది ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఇక‌, బార్ల‌కు లైసెన్సులు ఇచ్చారు కాబ‌ట్టి.. వారు హైకోర్టుకు వెళ్లారు కాబ‌ట్టి.. దీనిని ఉప‌సంహ‌రించుకునే ప‌రిస్థితి లేదు. కానీ, నిజానికి.. మ‌ద్యాన్ని క‌ట్ట‌డి చేయాల‌ని.. మ‌ద్యంపై ఆదాయాన్ని వ‌ద్ద‌ని అనుకుంటే.. బార్ల స‌మ‌యాన్ని భారీ ఎత్తున కుదించుకోవ‌చ్చు క‌దా.. దీనిని ఎవ‌రు కాదంటారు?

ఏ ప్ర‌భుత్వ ఒప్పందంలోనూ.. స‌మ‌యంపై ఒప్పందం చేసుకోదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందోన‌ని ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం త‌న చేతిలోనే ఉంచుకుంటుంది. కోర్టులు కూడా త‌ప్పుప‌ట్ట‌వు. సో. బార్ల‌కు ఉన్న స‌మ‌యాన్ని కుదించ‌డం వ‌ల్ల కూడా.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అవ‌కాశం ఉందిక‌దా.. కానీ, అలా ఎందుకు చేయ‌లేదు.. అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఎవ‌రిని ఎవ‌రు మోసం చేస్తున్నారో.. స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నారు. 

This post was last modified on March 26, 2022 6:42 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

1 hour ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago