Political News

మద్యంపై జ‌గ‌న్మాయ‌.. ఎవ‌రిని ఎవ‌రు మోసం చేస్తున్నారు?

రాష్ట్రం మ‌ద్యం విష‌యం.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో పెద్ద ఎత్తున కుదిపివేసిన విష‌యం తెలిసిందే. క‌ల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పెద్ద ఎత్తున విజృంభించిన విష‌యం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ, శాస‌న మండ‌లిలోనూ.. దీనిపై చ‌ర్చ‌కు టీడీపీ ప‌ట్టుబ‌ట్డింది. కానీ, వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగి.. స‌స్పెన్ష‌న్ ప‌ర్వానికి తెర‌దీసిం ది. స‌రే.. ఇది జ‌రిగిపోయిన గ‌తం. కానీ, ఈ సంద‌ర్భంగా స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడిన వ్యాఖ్య‌లపై మాత్రం ప్ర‌జాక్షేత్రంలో ఇప్ప‌టికీ.. చ‌ర్చ సాగుతోంది.

జే బ్రాండ్స్ అంటూ.. టీడీపీ ఏదైతే.. ప్ర‌చారం చేస్తోందో.. వాటిని తాను తీసుకురాలేద‌ని.. దాదాపు 234 ర‌కా ల బ్రాండ్ల‌ను గ‌త టీడీపీ ప్ర‌భుత్వ‌మే తీసుకువ‌చ్చింద‌ని.. జ‌గ‌న్ చెప్పారు. దీనిలో త‌మ ప్ర‌మేయం ఏమీలే ద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆరు మాసాల్లో.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని తీసుకువ చ్చి.. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుకుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, అదేస‌మ‌యంలో అసలు త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. బార్ వ్య‌వ‌స్థ‌ను తీసేయాల‌ని అనుకున్నామ‌ని అన్నారు.

కానీ, అప్ప‌టికి చంద్ర‌బాబు దిగిపోతూ.. దిగిపోతూ.. బార్ల‌కు ఐదేళ్ల‌పాటు లైసెన్సులు రెన్యువ‌ల్ చేశార‌ని.. దీంతోనే ప్ర‌జ‌ల‌కు మ‌ద్యం అందుబాటులోకి వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ రెండు విష‌యాల‌పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వ‌ర‌కు దృష్టి పెట్టారు. నిజ‌మే.. చంద్ర‌బాబు చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని దాదాపు 234 ర‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని అనుకుందాం. మ‌రి ప్ర‌జాప్ర‌భుత్వంగా.. రాజ‌న్న‌ రాజ్యాన్ని స్థాపిస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఆ నిర్ణ‌యాన్ని ఎందుకు ర‌ద్దు చేయ‌లేదు? అనేది ప్ర‌ధాన డిమాండ్‌.

ఎలాంటి అనుమ‌తి లేద‌ని.. పేర్కొంటూ.. దాదాపు 8 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల్చేసిన‌.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు హాని చేస్తుంద‌ని.. తెలిసి కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించిన(జ‌గ‌న్ చెప్పిన‌ట్టు) చ‌వ‌క‌బారు మ‌ద్యాన్ని ఎందుకు ఉప‌సంహ‌రించ‌లేదు.?  అదేస‌మ‌యంలో మంచి బ్రాండ్ల మ‌ద్యాన్ని ఎందుకు క‌ట్ట‌డి చేసిన‌ట్టు? అనేది ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఇక‌, బార్ల‌కు లైసెన్సులు ఇచ్చారు కాబ‌ట్టి.. వారు హైకోర్టుకు వెళ్లారు కాబ‌ట్టి.. దీనిని ఉప‌సంహ‌రించుకునే ప‌రిస్థితి లేదు. కానీ, నిజానికి.. మ‌ద్యాన్ని క‌ట్ట‌డి చేయాల‌ని.. మ‌ద్యంపై ఆదాయాన్ని వ‌ద్ద‌ని అనుకుంటే.. బార్ల స‌మ‌యాన్ని భారీ ఎత్తున కుదించుకోవ‌చ్చు క‌దా.. దీనిని ఎవ‌రు కాదంటారు?

ఏ ప్ర‌భుత్వ ఒప్పందంలోనూ.. స‌మ‌యంపై ఒప్పందం చేసుకోదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందోన‌ని ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం త‌న చేతిలోనే ఉంచుకుంటుంది. కోర్టులు కూడా త‌ప్పుప‌ట్ట‌వు. సో. బార్ల‌కు ఉన్న స‌మ‌యాన్ని కుదించ‌డం వ‌ల్ల కూడా.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే అవ‌కాశం ఉందిక‌దా.. కానీ, అలా ఎందుకు చేయ‌లేదు.. అనేది సామాన్యుల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ఎవ‌రిని ఎవ‌రు మోసం చేస్తున్నారో.. స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నారు. 

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

35 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago