వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యి. 2019 ఎన్నికల ఫలితంతో తలబొప్పికట్టిన నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలనే వ్యూహం అత్యంత కీలకంగా మారింది. అటువైపు.. జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా .. చూడాలనే వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు కానీ, పవన్ కానీ.. ఈ విషయంలో ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోయి నా.. పొత్తుల దిశగానే రెండు పార్టీలూ అడుగులు వేస్తుండడం గమనార్హం. దీనిపై మరో రెండు మాసాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే.. పొత్తులకు సంబందించి టీడీపీలో ఒక వాదన తెరమీదకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు బలం ఎంత ఉంది? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే మూడు విషయాలను పరిశీలిస్తే.. కేవలం రెండు జిల్లాల్లోనే జనసేన టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
గత ఏడాది జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈ రెండు పార్టీల నాయకులు అనధికార పొత్తు పెట్టుకుని గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. ఈ జిల్లాల్లోనే.. జనసేన కు బలం, బలగం కూడా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో బలం అంతో ఇంతో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన సామర్థ్యం చూపించే స్థాయి ఈ రెండు జిల్లాల్లోనే ఉందని.. జనసేన నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనేటీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఈ రెండు జిల్లాలను తమకు వదిలేసి.. మిగిలిన రాష్ట్రం మొత్తం. టీడీపీ పోటీ చేసిననా తమకు అభ్యంతరం లేదనే వాదన వినిపిస్తోంది.
అంటే.. జనసేన తన సత్తాను చాటేందుకు ఉభయ గోదావరి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ రెండు జల్లాల్లోని మొత్తం 31 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలను(కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం) తమకు వదిలేయాలనే డిమాండ్ తెరమీదికి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన రాష్ట్రం మొత్తం టీడీపీ పోటీ చేస్తే.. తాము మద్దతిస్తామనే డిమాండ్ను తెరమీదికి తేవాలని.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు అంటున్నారు. మరి ఇదే జరిగితే.. రేపు ఈ విషయంపైనే జనసేన పట్టుబడితే… టీడీపీ ఏం చేయాలనే విషయంపై తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…