వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని.. టీడీపీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నా యి. 2019 ఎన్నికల ఫలితంతో తలబొప్పికట్టిన నేపథ్యంలో చంద్రబాబుకు ఇప్పుడు పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలనే వ్యూహం అత్యంత కీలకంగా మారింది. అటువైపు.. జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా .. చూడాలనే వ్యూహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు.. చంద్రబాబు కానీ, పవన్ కానీ.. ఈ విషయంలో ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోయి నా.. పొత్తుల దిశగానే రెండు పార్టీలూ అడుగులు వేస్తుండడం గమనార్హం. దీనిపై మరో రెండు మాసాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే.. పొత్తులకు సంబందించి టీడీపీలో ఒక వాదన తెరమీదకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు బలం ఎంత ఉంది? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే మూడు విషయాలను పరిశీలిస్తే.. కేవలం రెండు జిల్లాల్లోనే జనసేన టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
గత ఏడాది జరిగిన మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఈ రెండు పార్టీల నాయకులు అనధికార పొత్తు పెట్టుకుని గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. ఈ జిల్లాల్లోనే.. జనసేన కు బలం, బలగం కూడా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో బలం అంతో ఇంతో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన సామర్థ్యం చూపించే స్థాయి ఈ రెండు జిల్లాల్లోనే ఉందని.. జనసేన నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనేటీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఈ రెండు జిల్లాలను తమకు వదిలేసి.. మిగిలిన రాష్ట్రం మొత్తం. టీడీపీ పోటీ చేసిననా తమకు అభ్యంతరం లేదనే వాదన వినిపిస్తోంది.
అంటే.. జనసేన తన సత్తాను చాటేందుకు ఉభయ గోదావరి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుంటే.. ఈ రెండు జల్లాల్లోని మొత్తం 31 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలను(కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం) తమకు వదిలేయాలనే డిమాండ్ తెరమీదికి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన రాష్ట్రం మొత్తం టీడీపీ పోటీ చేస్తే.. తాము మద్దతిస్తామనే డిమాండ్ను తెరమీదికి తేవాలని.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు అంటున్నారు. మరి ఇదే జరిగితే.. రేపు ఈ విషయంపైనే జనసేన పట్టుబడితే… టీడీపీ ఏం చేయాలనే విషయంపై తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2022 4:20 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…