Political News

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఫైర్‌

ఏపీలో జ‌రుగుతున్న క‌ల్తీసారా మ‌ర‌ణాలు, జేబ్రాండ్స్ అమ్మ‌కాలు వంటి అంశాల‌పై టీడీపీ, వైసీపీల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రెండు స‌భ‌లు కూడా ఆందోళ‌న‌ల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా.. జ‌న‌సేన కీల‌క నేత … నాగ‌బాబు స్పందించారు. సీఎం జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో ఆయ‌న వ్యాఖ్య‌లు గుప్పించారు. ఒకింత ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు.

నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకం దారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆయన నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో సారా ఉత్ప‌త్తి, వినియోగం తీవ్ర‌స్థాయిలో ఉంద‌ని.. పేర్కొన్నారు. అంతేకాదు.. దీని వినియోగం ఎక్కువ‌గా ఉంద‌ని బాధిత కుటుంబాలు చెబుతున్నాయ‌న్నారు.

నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అక్క‌డ ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించామ‌ని, బాధిత కుటుంబాల‌తో మాట్లాడామ‌ని అన్నారు.  సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందన్న నాగబాబు.. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నాటుసారా అమ్మకందారులను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు ?. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉంది. సీఎం జగన్ వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. నేను స్వయంగా జంగారెడ్డిగూడెం వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాను.. అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్పీ వీడియోను విడుద‌ల చేశారు. 

This post was last modified on March 24, 2022 9:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

4 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

5 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

6 hours ago