ఏపీలో జరుగుతున్న కల్తీసారా మరణాలు, జేబ్రాండ్స్ అమ్మకాలు వంటి అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సభలు కూడా ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. జనసేన కీలక నేత … నాగబాబు స్పందించారు. సీఎం జగన్పై తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకం దారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆయన నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సారా ఉత్పత్తి, వినియోగం తీవ్రస్థాయిలో ఉందని.. పేర్కొన్నారు. అంతేకాదు.. దీని వినియోగం ఎక్కువగా ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయన్నారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించామని, బాధిత కుటుంబాలతో మాట్లాడామని అన్నారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందన్న నాగబాబు.. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు ?. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉంది. సీఎం జగన్ వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. నేను స్వయంగా జంగారెడ్డిగూడెం వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాను.. అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సెల్పీ వీడియోను విడుదల చేశారు.
This post was last modified on March 24, 2022 9:28 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…