ఏపీలో జరుగుతున్న కల్తీసారా మరణాలు, జేబ్రాండ్స్ అమ్మకాలు వంటి అంశాలపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు సభలు కూడా ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. జనసేన కీలక నేత … నాగబాబు స్పందించారు. సీఎం జగన్పై తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. నాటుసారా అమ్మకం దారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆయన నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సారా ఉత్పత్తి, వినియోగం తీవ్రస్థాయిలో ఉందని.. పేర్కొన్నారు. అంతేకాదు.. దీని వినియోగం ఎక్కువగా ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయన్నారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించామని, బాధిత కుటుంబాలతో మాట్లాడామని అన్నారు. సీఎం వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉందన్న నాగబాబు.. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నాటుసారా అమ్మకందారులను సీఎం ఎందుకు వెనకేసుకొస్తున్నారు ?. నాటుసారా కారణంగా ఎవరూ చనిపోలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉంది. సీఎం జగన్ వైఖరితో నాటుసారా మాఫియా మరింత విజృంభించే ప్రమాదం ఉంది. సాక్షాత్తూ అసెంబ్లీలోనే సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం నిజం ఒప్పుకుని మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. నేను స్వయంగా జంగారెడ్డిగూడెం వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాను.. అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సెల్పీ వీడియోను విడుదల చేశారు.
This post was last modified on March 24, 2022 9:28 pm
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…