Political News

ఢిల్లీలో రేవంత్ దూకుడు

తెలంగ‌ణ రాష్ట్ర కాంగ్రెస్ లో పీసీసీ ఛీఫ్‌ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల పంచాయితీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. రేవంత్ పీసీసీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఓ వర్గం నేతలు ఆయనతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  గతంలోనూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ తో అస్త్రం దొరికినట్టుగా భావించారు. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమితో అక్కడ పీసీసీ చీఫ్ లను హైకమాండ్ తొలగించింది. ఇదే మంచి అనుకొని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హస్తిన వెళ్లారు.

ఇప్పుడు నేరుగా పార్టీ చీఫ్ ను కలిసి అన్ని విషయాలను వివరించాలని డిసైడయ్యారు. అయితే, వారికి ఢిల్లీలో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాల గురించి వివ‌రించ‌డం, పీసీసీ చీఫ్ రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి హాస్తిన వెళ్లిన నేతలు అయోమయంలో పడ్డారని స‌మాచారం. దీనికి కార‌ణం పార్టీ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్కపోవడం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాను కలిసే చాన్స్ ఉంటుందని సీనియర్లు భావించారు. మంగ‌ళ‌వారం  ఉదయం నుండి సాయంత్రం వరకు సోనియా అపాయింట్మెంట్ కోసం సీరియస్ గా ట్రై చేసినా దొరకలేదని సమాచారం. బుధ‌వారం సైతం అదే ప‌రిస్థితి ఎదురైంద‌ని తెలుస్తోంది. సోనియా అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు ఉండాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పుడప్పుడే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఒక్కరిద్దరు నేతలు ఇవాల్టి వరకు వెయిట్ చేసి వెనుదిరిగి వచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను కలిసిన రేవంత్ పార్టీలో జరుగుతున్న విషయాలు, లాయలిస్టుల పేరుతో సీనియర్ల సమావేశాలపై ఆయనకు రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఢిల్లీలో రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్ల పంచాయ‌తీలో రేవంత్ పైచేయి సాధించిన‌ట్లు స‌మాచారం.

This post was last modified on March 24, 2022 8:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

46 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago