తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పెగాసస్ వ్యవహారంలో ఇరికించాలి అని భావిస్తున్న వైసీపీకి అనూహ్య పరిణామాలే ఎదురవుతున్నాయి. అదేవిధంగా సభలో సభ్యుల మాట తీరుపై కూడా మీడియాలో కథనాలు వస్తుండడంతో ఇంకా విషయం తీవ్ర తరం అవుతూ వస్తోంది.ఇదే దశలో తాము ఏ నిఘా సంబంధ వ్యవహారాలను ప్రొత్సహిస్తూ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని పదే పదే టీడీపీ చెబుతుండడం, అదేవిధంగా సభా సంఘానికి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఈ విషయంలో ఓ విధంగా విజయం తెలుగు దేశాన్ని వరించింది అనే చెప్పాలి. దీంతో తగాదా ఎక్కడిదాకా పోతుందో అని వైసీపీ కూడా కాస్త వెనక్కు తగ్గి మాట్లాడుతోంది.
ఈ దశలో పెగాసస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే దీనిపై కొన్ని వివరాలు అందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని సభా సంఘం ఎదుట హాజరయ్యేలా చేయగలరా అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. పెగాసస్ స్పై వేర్ ను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారని దీదీ చెప్పిన మాటలతో ఏపీ అసెంబ్లీ ఒక్క ఉదుటున ఊగిపోయింది. విపక్ష మరియు స్వపక్ష సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు రాజుకున్నాయి.
ఈ తరుణంలో చంద్రబాబు వర్గంకు జగన్ వర్గంకు మధ్య రేగిన వివాదం ఒక్క సారిగా పై స్థాయికి చేరిపోయింది. మొత్తానికి స్పీకర్ కాస్త తగ్గి సభా సంఘం ఏర్పాటు చేశారు. ఇందుకు వైసీపీ మరియు టీడీపీ వర్గాలు ఏక కాలంలో విన్నవించడం కూడా దోహదం అయింది. దీంతో త్వరలో సభా సంఘం ఏర్పాటై మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది.
ఇక ఈ సాఫ్ట్వేర్ ను ఎవరికి పడితే వారికి అమ్మరని జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా అంటున్నారు. అదేవిధంగా ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు వీల్లేదని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో శాసన సభ మాత్రం ఇందుకు విరుద్ధంగా వాదులాటకు తావిస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా తాము ఆ స్పై వేర్ ను కొనుగోలు చేయలేదని పదే పదే టీడీపీ అంటోంది రేపటి వేళ ఇదే కనుక నిరూపణ అయితే వైసీపీ ఏం సమాధానం చెప్పనుందో కూడా ఆసక్తికరంగా ఉంది. ఓ విధంగా జగన్ ఇరుక్కుపోయారు అనే చెప్పాలి. సభా సంఘం నియమించి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఇరుక్కుపోయారు.
This post was last modified on March 24, 2022 8:16 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…