Categories: Political News

లోక్ సభలో ఏపీ కల్తీ మద్యంపై రచ్చ

ఏపీలో నాటు సారా, కల్తీ మద్యం బ్రాండ్ల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. జంగారెడ్డి గూడెం మృతుల అంశంపై అసెంబ్లీ గత వారం రోజులుగా అట్టుడుకుతోంది. తాజాగా ఈ వ్యవహారం లోక్ సభలోనూ అగ్గి రాజేసింది. ఏపీలో మ‌ద్యం నాణ్య‌తపై ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లోక్ సభలో ప్రస్తావించారు. అలా లేఖ రాసినందుకు త‌న‌పై వైసీపీ ప్రభుత్వం క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని రఘురామ సభలో ఆరోపించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా, పార్ల‌మెంటు స‌భ్యుడిగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌తోనే తాను ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని రఘురామ అన్నారు. ప్రధానికి లేఖ  రాశాన‌న్న కార‌ణంతో త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టేందుకు, ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్రయ‌త్నిస్తోంద‌ని ర‌ఘురామ‌ లోక్ స‌భ‌లో ఆరోపించారు. ఏపీలో అమ్మే చీప్ లిక్కర్‌లో విష పదార్థాలున్నట్టు ల్యాబ్ టెస్ట్‌ల్లో బయటపడిందని రఘురామ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని రఘురామ చెప్పారు.

మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించ‌డం త‌ప్పా? లేదంటే ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌ధానికి తెలియ‌జేయ‌డం త‌ప్పా? అని సభాముఖంగా జగన్ సర్కార్ తీరును, వైసీపీ ఎంపీల ధోరణిని ఎండగట్టారు.ఈ సందర్భంగా రఘురామ ప్రసంగానికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అడ్డుపడ్డారు. రఘురామకు వ్యతిరేకంగా మార్గాని భరత్ ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, సభలో ఆ తరహా వ్యాఖ్యలు చేసిన సభ్యులను బయటకు పంపాలని రఘురామ…ప్యానెల్ స్పీకర్ రమాదేవికి రిక్వెస్ట్ చేశారు. దీంతో, భరత్ మాట్లాడిన మాటలను సభ రికార్డుల నుంచి తొలగించాలని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు.

అంతకుముందు, రఘురామ ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ అన్నారు.  చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌కు  రఘురామ టెస్ట్ చేయించిన మద్యం శాంపిల్స్‌ ఏపీ నుంచి సేకరించినవే అని చెప్పడానికి ఆధారాలు లేవని రజత్‌ భార్గవ అన్నారు. చెన్నై ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలీదని, శాంపిల్స్‌ను బీఎస్ఐ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా టెస్ట్ చేయలేదని ఎస్‌జీఎస్ తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షలు నిర్వహించలేదని,  శాంపిల్స్‌ హానికరం అని ఎస్‌జీఎస్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా లేదని అన్నారు.

Satya

Recent Posts

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

1 hour ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

2 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

4 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

4 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

8 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

8 hours ago