Political News

తప్పుచేసి దిద్దుకుంటున్న ప్రభుత్వం

తప్పులు చేయటం తర్వాత తీరిగ్గా దిద్దుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నియమించిన స్మార్ట్ సిటి ఛైర్మన్లతో ఇపుడు రాజీనామాలు చేయించటం ఇందులో భాగమే. తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకోవటం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తర్వాత సమస్య ఎదురైతే తల పట్టుకోవటం మామూలైపోయింది. దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా కొన్నింటిని స్మార్ట్ సిటి పథకంలో ఎంపికచేసింది. అలా దేశంలో ఎంపికైన నగరాల్లో కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి కూడా ఉన్నాయి. వీటిని ఎలా డెవలప్ చేయాలి, అందుకు ప్రణాళిక తయారు చేయటం, నిధుల విడుదల, ఖర్చు, పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే. పై వ్యవహారాలన్నీ సజావుగా జరిగేందుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఛైర్మన్ గా ఉంటారు. అలాగే ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇన్చార్జిలు.

ఇందులో ఎక్కడ కూడా రాజకీయ నేతల ప్రమేయమే ఉండదు. అయినా సరే జగన్ ప్రభుత్వం  వైసీపీ నేతలను స్మార్ట్ సిటీలకు  ఛైర్మన్లుగా నియమించింది. నిజానికి ఛైర్మన్లుగా పార్టీ నేతలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ ముందు వెనకా చూసుకోకుండా జగన్ డిసైడ్ చేయగానే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసేశారు. జగన్ చేసిందే తప్పంటే, ఉన్నతాధికారులు ఉత్తర్వులు రిలీజ్ చేయటం అంతకన్నా తప్పు. జగన్ కు నిబంధనలు తెలియకపోవచ్చు కానీ కేంద్ర మార్గదర్శకాలను తెలియజేయాల్సిన అవసరం ఉన్నతాధికారులకుంది.

ఛైర్మన్లుగా నియమించిన మూడునెలల తర్వాత కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దాంతో చేసిన తప్పును దిద్దికోవటంలో భాగంగా ఛైర్మన్లతో రాజీనామాలు చేయించారు. అసలు ఛైర్మన్లను నియమించటం ఎందుకు ? ఇపుడు రాజీనామాలు చేయించటం ఎందుకు ? అవసరమని అనుకుంటే ఛైర్మన్లుగా నియమించిన ముగ్గురిని ఇంకేదన్నా పదవుల్లో నియమించుండచ్చు. ఛైర్మన్లుగా  బాధ్యతలు తీసుకున్న ముగ్గురు మూడు నెలల్లోనే రాజీనామాలు చేయటంటే వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ సమస్యే. భవిష్యత్తులో ఇలాంటి నియామకాలు చేసేముందు జగన్ ఒకసారి నిబంధనలు, మార్గదర్శకాలను చూసుకుంటే బాగుంటుంది.

This post was last modified on March 23, 2022 12:26 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

24 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago