YS Jagan Mohan Reddy
తప్పులు చేయటం తర్వాత తీరిగ్గా దిద్దుకోవటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. గతంలో ప్రభుత్వం నియమించిన స్మార్ట్ సిటి ఛైర్మన్లతో ఇపుడు రాజీనామాలు చేయించటం ఇందులో భాగమే. తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకోవటం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తర్వాత సమస్య ఎదురైతే తల పట్టుకోవటం మామూలైపోయింది. దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొన్నింటిని స్మార్ట్ సిటి పథకంలో ఎంపికచేసింది. అలా దేశంలో ఎంపికైన నగరాల్లో కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి కూడా ఉన్నాయి. వీటిని ఎలా డెవలప్ చేయాలి, అందుకు ప్రణాళిక తయారు చేయటం, నిధుల విడుదల, ఖర్చు, పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వానిదే. పై వ్యవహారాలన్నీ సజావుగా జరిగేందుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఛైర్మన్ గా ఉంటారు. అలాగే ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇన్చార్జిలు.
ఇందులో ఎక్కడ కూడా రాజకీయ నేతల ప్రమేయమే ఉండదు. అయినా సరే జగన్ ప్రభుత్వం వైసీపీ నేతలను స్మార్ట్ సిటీలకు ఛైర్మన్లుగా నియమించింది. నిజానికి ఛైర్మన్లుగా పార్టీ నేతలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ ముందు వెనకా చూసుకోకుండా జగన్ డిసైడ్ చేయగానే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసేశారు. జగన్ చేసిందే తప్పంటే, ఉన్నతాధికారులు ఉత్తర్వులు రిలీజ్ చేయటం అంతకన్నా తప్పు. జగన్ కు నిబంధనలు తెలియకపోవచ్చు కానీ కేంద్ర మార్గదర్శకాలను తెలియజేయాల్సిన అవసరం ఉన్నతాధికారులకుంది.
ఛైర్మన్లుగా నియమించిన మూడునెలల తర్వాత కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దాంతో చేసిన తప్పును దిద్దికోవటంలో భాగంగా ఛైర్మన్లతో రాజీనామాలు చేయించారు. అసలు ఛైర్మన్లను నియమించటం ఎందుకు ? ఇపుడు రాజీనామాలు చేయించటం ఎందుకు ? అవసరమని అనుకుంటే ఛైర్మన్లుగా నియమించిన ముగ్గురిని ఇంకేదన్నా పదవుల్లో నియమించుండచ్చు. ఛైర్మన్లుగా బాధ్యతలు తీసుకున్న ముగ్గురు మూడు నెలల్లోనే రాజీనామాలు చేయటంటే వాళ్ళకు కూడా ప్రిస్టేజ్ సమస్యే. భవిష్యత్తులో ఇలాంటి నియామకాలు చేసేముందు జగన్ ఒకసారి నిబంధనలు, మార్గదర్శకాలను చూసుకుంటే బాగుంటుంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…