దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు కనీసం సమర్థవంతమైన అడుగులు కూడా వేయడం లేదు. కేంద్రంలో వరుసగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు చేతుల్లో ఉన్న రాష్ట్రాలనూ చేజార్చుకుంటోంది. కానీ పార్టీ అధిష్ఠానం వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్లో గత ఏడేళ్లుగా ఒకే తంతు నడుస్తోంది. వివిధ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం.. వెంటనే తాము రాజీనామా చేస్తామంటూ గాంధీ కుటుంబ నేతలు ముందుకు రావడం పరిపాటిగా మారింది. ఆ రాజీనామాలు చేయవద్దంటూ వాళ్లను మిగిలిన నేతలు వారించడం.. గాంధీ కుటుంబ నాయకులకు మద్దతుగా అన్ని రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేసి పంపడం.. ఇది పార్టీలో ప్రహసనంగా మారింది.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ పెత్తనం మాత్రం తన చేతిలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రాష్ట్రాల పీసీసీలేమో గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ తీర్మానాలు చేసి ఢిల్లీ పంపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీఎల్పీ కూడా ఇదే తీర్మానం చేసింది.
ఇలా కొన్నేళ్లుగా కాంగ్రెస్లో ఒకే కథ నడుస్తోంది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కూడా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంక.. పార్టీ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ వాళ్లను మిగతా నేతలు వారించారని చెబుతున్నారు. ఇప్పుడేమో రాహుల్ ఎలా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రశ్న వస్తోంది. 2019లో ఓటమికి బాధ్యుడిగా రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు ఏం సాధించారని తిరిగి ఆ పదవి చేపడతారంటూ సీనియర్లు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. ఇలా ముగింపు లేని కథగా సాగుతున్న కాంగ్రెస్ ఎపిసోడ్కు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో? ఆ పార్టీ ఎప్పుడు బాగు పడుతుందో? తెలియడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on March 17, 2022 5:50 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…