దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు కనీసం సమర్థవంతమైన అడుగులు కూడా వేయడం లేదు. కేంద్రంలో వరుసగా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు చేతుల్లో ఉన్న రాష్ట్రాలనూ చేజార్చుకుంటోంది. కానీ పార్టీ అధిష్ఠానం వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది.
కాంగ్రెస్లో గత ఏడేళ్లుగా ఒకే తంతు నడుస్తోంది. వివిధ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడం.. వెంటనే తాము రాజీనామా చేస్తామంటూ గాంధీ కుటుంబ నేతలు ముందుకు రావడం పరిపాటిగా మారింది. ఆ రాజీనామాలు చేయవద్దంటూ వాళ్లను మిగిలిన నేతలు వారించడం.. గాంధీ కుటుంబ నాయకులకు మద్దతుగా అన్ని రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేసి పంపడం.. ఇది పార్టీలో ప్రహసనంగా మారింది.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ పెత్తనం మాత్రం తన చేతిలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రాష్ట్రాల పీసీసీలేమో గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ తీర్మానాలు చేసి ఢిల్లీ పంపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీఎల్పీ కూడా ఇదే తీర్మానం చేసింది.
ఇలా కొన్నేళ్లుగా కాంగ్రెస్లో ఒకే కథ నడుస్తోంది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కూడా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంక.. పార్టీ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ వాళ్లను మిగతా నేతలు వారించారని చెబుతున్నారు. ఇప్పుడేమో రాహుల్ ఎలా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రశ్న వస్తోంది. 2019లో ఓటమికి బాధ్యుడిగా రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు ఏం సాధించారని తిరిగి ఆ పదవి చేపడతారంటూ సీనియర్లు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. ఇలా ముగింపు లేని కథగా సాగుతున్న కాంగ్రెస్ ఎపిసోడ్కు ఎప్పుడు శుభం కార్డు పడుతుందో? ఆ పార్టీ ఎప్పుడు బాగు పడుతుందో? తెలియడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…