Political News

ఏడేళ్లుగా ఇవే రాజీనామా ఆట‌లు.. కాంగ్రెస్‌కు బోర్ కొట్ట‌ట్లేదా?

దేశ రాజకీయాల్లో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఒక‌ప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు క‌నీసం స‌మ‌ర్థ‌వంత‌మైన అడుగులు కూడా వేయ‌డం లేదు. కేంద్రంలో వ‌రుస‌గా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు చేతుల్లో ఉన్న రాష్ట్రాల‌నూ చేజార్చుకుంటోంది. కానీ పార్టీ అధిష్ఠానం వైఖ‌రిలో మాత్రం ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం ఆ పార్టీ శ్రేణుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

కాంగ్రెస్‌లో గ‌త ఏడేళ్లుగా ఒకే తంతు న‌డుస్తోంది. వివిధ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి పాలు కావ‌డం.. వెంట‌నే తాము రాజీనామా చేస్తామంటూ గాంధీ కుటుంబ నేత‌లు ముందుకు రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఆ రాజీనామాలు చేయ‌వ‌ద్దంటూ వాళ్ల‌ను మిగిలిన నేత‌లు వారించ‌డం.. గాంధీ కుటుంబ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తుగా అన్ని రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేసి పంప‌డం.. ఇది పార్టీలో ప్ర‌హ‌స‌నంగా మారింది.

పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడు కావాల‌ని సీనియ‌ర్ నేత‌లు కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఏమో అందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. కానీ పెత్త‌నం మాత్రం త‌న చేతిలోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రాష్ట్రాల పీసీసీలేమో గాంధీ బాధ్య‌త‌లు చేపట్టాలంటూ తీర్మానాలు చేసి ఢిల్లీ పంపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీఎల్పీ కూడా ఇదే తీర్మానం చేసింది.

ఇలా కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో ఒకే క‌థ న‌డుస్తోంది. ఆ పార్టీ ఇప్ప‌ట్లో కోలుకునేలా కూడా క‌నిపించ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మ‌రోసారి సోనియా, రాహుల్‌, ప్రియాంక‌.. పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాళ్ల‌ను మిగ‌తా నేత‌లు వారించార‌ని చెబుతున్నారు. ఇప్పుడేమో రాహుల్ ఎలా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌నే ప్ర‌శ్న వ‌స్తోంది. 2019లో ఓట‌మికి బాధ్యుడిగా రాజీనామా చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ఏం సాధించార‌ని తిరిగి ఆ ప‌ద‌వి చేప‌డ‌తారంటూ సీనియ‌ర్లు నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. ఇలా ముగింపు లేని క‌థ‌గా సాగుతున్న కాంగ్రెస్ ఎపిసోడ్కు ఎప్పుడు శుభం కార్డు ప‌డుతుందో? ఆ పార్టీ ఎప్పుడు బాగు ప‌డుతుందో? తెలియ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on March 17, 2022 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

17 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

46 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

11 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago