Political News

తూచ్… పవన్ మీనింగ్ టీడీపీతో పొత్తు కాదట

‘రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సభలో బహిరంగంగానే పవన్ ప్రకటించారు. ఇపుడా ప్రకటనను కవర్ చేసుకోలేక జనసేన సీనియర్ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనవ్వను అని ఎవరైనా అంటే ఏమిటర్ధం ? పైగా అంతకుముందే వైసీపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు రెడీ అన్నట్లుగా ఒకమాట వదిలారు.

దాంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అని అనుకున్నారు. ఇప్పటికే పవన్ తో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపటం, తాజాగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్ ప్రకటించటంతో అందరు టీడీపీతో పొత్తనే అనుకున్నారు. మరి జనాల్లో లేదా జనసైనికుల్లో ప్రత్యేకించి కమలం పార్టీ నేతల్లో దీని ప్రభావం నెగిటివ్ గా మొదలైనట్లు సమాచారం.

ఎందుకంటే టీడీపీని తమతో కలుపుకోవాలంటే ముందు ఒప్పుకోవాల్సింది బీజేపీ అగ్రనేతలు. అలాంటిది చంద్రబాబుతో పొత్తును పవన్ ఏకపక్షంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినట్లు బీజేపీ నేతల్లో చర్చలు మొదలైపోయిందట. దాంతో జరగబోయే నష్టం ఏమిటో జనసేన నేతలకు అర్ధమైనట్లుంది. అందుకనే ఇపుడు కవరింగ్ కు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటే అర్ధం టీడీపీతో పొత్తుకు రెడీ అని కాని లేదా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుతానని కాదట. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా జనసేనకు మాత్రమే పడతాయని అర్ధమట.

2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా ఏకపక్షంగా వైసీపీకి ఎలా పడ్డాయో 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ జనసేనకు పడటం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అంటున్నారు. ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏ ఛానల్లో మాట్లాడినా ఇలాగే వివరించి చెబుతున్నారు. అంటే పవన్ ప్రకటన తాలూకు ఎఫెక్ట్ బీజేపీపైన ఏ విధంగా పడింది తర్వాత దాని రియాక్షన్ జనసేనలో ఎలా కనబడిందో అర్ధమవుతోంది. చేసే ప్రకటనేదో స్పష్టంగా చేసుంటే ఇపుడీ గొడవ ఉండేది కాదు కదా.

This post was last modified on March 17, 2022 11:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’

సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…

40 minutes ago

అర్ధరాత్రి అల్లకల్లోలం చేసిన కోహ్లీ

భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…

1 hour ago

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి…

4 hours ago

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

7 hours ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

11 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

13 hours ago