ఇంకో వారం రోజులే మిగిలుంది ఆర్ఆర్ఆర్ విడుదలకు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చాలా ఆలస్యమైనా, విడుదల పలుమార్లు వాయిదా పడ్డ హైప్కేమీ తక్కువ లేదు. రిలీజ్ ముంగిట ఆ హైప్ను మరింత పెంచడానికి చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రమోషన్లు పునఃప్రారంభించి దూకుడు మీదున్నారు రాజమౌళి, తారక్, చరణ్. ఈ ముగ్గురూ కలిసి దేశమంతా తిరిగేస్తున్నారు.
ఇక ప్రమోషన్ల పరంగా పీక్స్ ఈ నెల 19న చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజే ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్. ఇందుకోసం ఆసక్తికర వేదికను ఎంచుకున్నారు. రాయలసీమ వాసులకు దగ్గరగా ఉండే కర్ణాటక ప్రాంతం చిక్బళ్లాపూర్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిథుల గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
చరణ్ తరఫున అతడి తండ్రి, మెగాస్టార్ చిరంజీవి.. తారక్ తరఫున అతడి బాబాయి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథులుగా వస్తారంటున్నారు. ఐతే వీళ్లు అతిథులు మాత్రమేనట. ముఖ్య అతిథి చాలా పెద్ద స్థాయి వ్యక్తిగా చెబుతున్నారు. ఆయనెవరో కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఒక సీఎం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రావడం అరుదైన విషయమే.
అందులోనూ తెలుగు హీరోల్ని పెట్టి ఒక దర్శకుడు తీసిన పాన్ ఇండియా మూవీకి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా వస్తే ఆ కళే వేరుగా ఉంటుంది. ఆయనతో పాటు కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్ సైతం ఈ వేడుకకు హాజరవుతారంటున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి ఇదొక్కటే ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంటుందా.. హైదరాబాద్లో మరో వేడుక ఏదైనా ప్లాన్ చేస్తారా అన్నది తెలియడం లేదు.
This post was last modified on March 17, 2022 12:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…