అవును కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే బలము, బలహనీత. దేశంలోని 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రోజుల్లో గాంధీ కుటుంబానికి మించిన నాయకత్వం మరోటి లేదని సీనియర్లంతా భజనలో ముణిగిపోయారు. ఇపుడు చాలా రాష్ట్రాల్లో దెబ్బతింటున్నపుడు నాయకత్వానికి గాంధీకుటుంబం పనికిరాదంటు ఇదే సీనియర్లు గోల గోల చేస్తున్నారు. సరైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించటంలో గాంధీకుటుంబం ఫెయిలైందనే చెప్పాలి.
దశాబ్దాల తరబడి గులాంనబీ ఆజాద్, జై రామ్ రమేష్, చిదంబరం, కపిల్ సిబల్, ఆనందశర్మ, హరీష్ రావత్, కమలనాద్, అశోక్ గెహ్లాట్ లాంటి ఎందరో సినియర్లు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయున్నారు. వీళ్ళంతట వీళ్ళు పదవుల్లో నుండి తప్పుకోరు, గాంధీ కుటుంబం వీళ్ళని తప్పించలేందు. దీని కారణంగా కొత్త నాయకత్వం, యువనాయకత్వం తయారుకాలేకపోయింది. అధికారంలో ఉన్నంతకాలం అన్నీరకాల పదవులను అనుభవించి ఇపుడు ఏకంగా గాంధీకుటుంబాన్నే విమర్శిస్తున్నారు సీనియర్లు.
పార్టీ ప్రస్తుత దుస్ధితికి సోనియా, రాహుల్, ప్రియాంకలు కూడా కారణమనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి రావటానికి గాంధీకుటుంబం చేతకానితనమే కారణం, పంజాబ్ లో అధికారంలో ఉండికూడా ఓడిపోవటానికీ గాంధీకుటుంబమే కారణం. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్యసింథియాను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుంటే ప్రభుత్వం కూలిపోయేదికాదు. పంజాబ్ లో పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ విషయంలో కఠినంగా ఉండంటే మరీ ఇంత ఘోరమైన ఓటమి ఎదురయ్యేదికాదేమో.
ఇక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా ఇంకా అధ్యక్షస్ధానంలో సోనియాయే కంటిన్యు అవుతున్నారంటే అందుకు రాహులే కారణం. సీనియర్ల విషయంలో కఠినంగా ఉండలేకపోవటం, కొత్తనాయకత్వాన్ని, యువనాయకత్వాన్ని ప్రోత్సహించలేకపోయారు. విచిత్రం ఏమిటంటే ఓట్లు వేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీయే వద్దుపొమ్మంటోంది. నరేంద్రమోడీకి ప్రత్యామ్నం తానేఅని జనాల్లో నమ్మకం కలిగించటంలో రాహుల్ ఫెయిలయ్యారు. ఇప్పటికైనా ముణిగిపోయిందేమీలేదు నిర్ణయాలు తీసుకోవటంలో కఠినంగా ఉంటే ముందు పార్టీ నాయకత్వం తర్వాత జనాల్లో కచ్చితంగా నమ్మకం పెరుగుతుంది.
This post was last modified on March 13, 2022 5:24 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…