సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తప్పుచేస్తున్నట్లే ఉంది. తాజా ఎన్నికల్లో అఖిలేష్ కర్నాల్ లో బీజేపీ అభ్యర్ధిపై గెలిచాడు. అలాగే రాంపూర్ అసెంబ్లీ నుండి అజంఖాన్ కూడా బీజేపీ అభ్యర్ధిపైనే గెలిచాడు. అయితే వీళ్ళద్దరు తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటికే ఎంపీలు కాబట్టి. ఎస్పీ ఎలాగూ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసేసి ఎంపీలుగానే కంటిన్యు అవుదామని అనుకుంటున్నారు.
ఇక్కడే అఖిలేష్ తప్పు చేస్తున్నారా అని అనిపిస్తోంది. అఖిలేష్ ఎంపీగా ఉన్నా ఎంఎల్ఏగా ఉన్నా పెద్ద తేడాఏమీలేదు. ఎందుకంటే ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలోనే ఉంటాడు, ఎంఎల్ఏగా ఉన్నా ప్రతిపక్షంలోనే కూర్చుంటాడు. అయితే ప్రతిపక్షంలో కూడా ఒక తేడావుంది. అదేమిటంటే ఎంపీగా ఉంటే పార్లమెంటులోని అనేక ప్రతిపక్షాల్లో అఖిలేష్ కూడా ఒకడంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో క్యాబినెట్ ర్యాంకన్నా వస్తుంది.
ఎంపీగా ఉండి ఇప్పటికిప్పుడు అఖిలేష్ సాధించేది కూడా ఏమీలేదు. ఎంతకాలమున్నా ఎంపీగానే ఉండాలంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే రేపటి లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయచ్చు. ఆపని ఇపుడు కూడా చేయచ్చు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా ఉండదు. పైగా ముఖ్యమంత్రిగా ఉంటేనే అఖిలేష్ రాష్ట్రంలో ఉంటారని లేకపోతే ఎంపీగా ఢిల్లీకి వెళిపోతారని జనాలు తప్పుపట్టే అవకాశముంది.
ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేస్తే మళ్ళీ ఉపఎన్నికలు తప్పవు. అప్పుడు కర్నాల్, రాంపూర్లో ఎస్పీ అభ్యర్ధులు గెలిచేది కూడా అనుమానమే. అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్ధులే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చేజేతులా రెండు అసెంబ్లీ స్ధానాలను పొగొట్టుకున్నట్లవుతుంది. ఎంపీగా అఖిలేష్ రాజీనామా చేసినా పార్టీ అధ్యక్షుడి హోదాలో జాతీయ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశముంది. రెండేళ్ళలో టర్మ్ అయిపోయే ఎంపీగా కన్నా ఐదేళ్ళుండే ఎంఎల్ఏ పదవిలో అఖిలేష్ కంటిన్యు అయితేనే మంచిది. మరి ఏమి చేస్తాడో చూడాల్సిందే.
This post was last modified on March 13, 2022 12:41 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…