సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తప్పుచేస్తున్నట్లే ఉంది. తాజా ఎన్నికల్లో అఖిలేష్ కర్నాల్ లో బీజేపీ అభ్యర్ధిపై గెలిచాడు. అలాగే రాంపూర్ అసెంబ్లీ నుండి అజంఖాన్ కూడా బీజేపీ అభ్యర్ధిపైనే గెలిచాడు. అయితే వీళ్ళద్దరు తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటికే ఎంపీలు కాబట్టి. ఎస్పీ ఎలాగూ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసేసి ఎంపీలుగానే కంటిన్యు అవుదామని అనుకుంటున్నారు.
ఇక్కడే అఖిలేష్ తప్పు చేస్తున్నారా అని అనిపిస్తోంది. అఖిలేష్ ఎంపీగా ఉన్నా ఎంఎల్ఏగా ఉన్నా పెద్ద తేడాఏమీలేదు. ఎందుకంటే ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలోనే ఉంటాడు, ఎంఎల్ఏగా ఉన్నా ప్రతిపక్షంలోనే కూర్చుంటాడు. అయితే ప్రతిపక్షంలో కూడా ఒక తేడావుంది. అదేమిటంటే ఎంపీగా ఉంటే పార్లమెంటులోని అనేక ప్రతిపక్షాల్లో అఖిలేష్ కూడా ఒకడంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో క్యాబినెట్ ర్యాంకన్నా వస్తుంది.
ఎంపీగా ఉండి ఇప్పటికిప్పుడు అఖిలేష్ సాధించేది కూడా ఏమీలేదు. ఎంతకాలమున్నా ఎంపీగానే ఉండాలంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే రేపటి లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేయచ్చు. ఆపని ఇపుడు కూడా చేయచ్చు కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా ఉండదు. పైగా ముఖ్యమంత్రిగా ఉంటేనే అఖిలేష్ రాష్ట్రంలో ఉంటారని లేకపోతే ఎంపీగా ఢిల్లీకి వెళిపోతారని జనాలు తప్పుపట్టే అవకాశముంది.
ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేస్తే మళ్ళీ ఉపఎన్నికలు తప్పవు. అప్పుడు కర్నాల్, రాంపూర్లో ఎస్పీ అభ్యర్ధులు గెలిచేది కూడా అనుమానమే. అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అభ్యర్ధులే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చేజేతులా రెండు అసెంబ్లీ స్ధానాలను పొగొట్టుకున్నట్లవుతుంది. ఎంపీగా అఖిలేష్ రాజీనామా చేసినా పార్టీ అధ్యక్షుడి హోదాలో జాతీయ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశముంది. రెండేళ్ళలో టర్మ్ అయిపోయే ఎంపీగా కన్నా ఐదేళ్ళుండే ఎంఎల్ఏ పదవిలో అఖిలేష్ కంటిన్యు అయితేనే మంచిది. మరి ఏమి చేస్తాడో చూడాల్సిందే.
This post was last modified on March 13, 2022 12:41 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…