Political News

ఈ కాంగ్రెస్ అభ్యర్ధి నిజంగా గ్రేట్

తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత తప్పటంలేదు. రాష్ట్రంలో మంచి సానుకూలతతో రెండోసారి బీజేపీ అధికారంలో కంటిన్యు అవుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడాలేకుండా రాష్ట్రం మొత్తం యోగి ఆదిత్యనాద్ పాలనపై జనాలు సానుకూలత చూపించారు. ఈ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీచేసినా బీజేపీ, ఎస్పీ తప్ప మరే పార్టీయేదీ మంచి ఫలితాలను రాబట్టలేకపోయింది.

నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన మాయావతి పార్టీ బీఎస్పీ కూడా పూర్తిగా దెబ్బతినేసింది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకోవటానికి ఏమీలేకపోయింది. పార్టీ తరపున పోటీచేసిన వందలాదిమంది అభ్యర్ధులకు ఠికాణాలేకుండా పోయింది. ఇలాంటి నేపధ్యంలోనే కూడా కాంగ్రెస్ తరపున ఒకే ఒక అభ్యర్ధి గెలిచారంటే సదరు అభ్యర్ధిని గ్రేట్ అని చెప్పక తప్పదు. పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక అభ్యర్ధి ఎవరయ్యా అంటే ఆరాధనా మిశ్ర. ఈమె మాత్రమే ఇక్కడ నుండి ఎందుకు గెలిచారంటే దీనికొక చరిత్రుంది.

అదేమిటంటే యూపీలో రాంపుర్ ఖాస్ అనే నియోజకవర్గముంది.  ఈ నియోజకవర్గంలో 1980 నుండి కాంగ్రెస్ అభ్యర్ధి తప్ప మరొకపార్టీ అభ్యర్ధి గెలిచిందే లేదట. బీజేపీ గాలికాదు ఎస్పీ, బీఎస్పీ గాలివీచిన ఎన్నికల్లో కూడా మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కనపెట్టేస్తే రాంపుర్ ఖాస్ మాత్రం కాంగ్రెస్ అడ్డానే అని తేలిపోయింది. 1980లో మొదటిసారి ఈ నియోజకవర్గంలో ప్రమాద్ తివారి గెలిచారు. 1985, 89,91, 93,96,2002, 2007,2012 ఎన్నికల్లో తివారీయే గెలిచారు.

2013లో తివారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో 2014లో ఇక్కడ జరిగిన ఉఫెన్నికలో తివారి కూతురు ఆరాధనా మిశ్ర పోటీచేసి గెలిచారు. తర్వాత జరిగిన 2017 ఎన్నికల్లో కూడా ఆమె గెలిచారు. మళ్ళీ తాజా ఎన్నికల్లో కూడా ఆరాధాన మిశ్రాయే గెలిచారు. అంటే తొమ్మిది ఎన్నికల్లో తండ్రి, మూడు ఎన్నికల్లో కూతురు గెలవటమంటే వీళ్ళకున్న రికార్డు మామూలుగా లేదని అర్ధమైపోతోంది. మరి రాష్ట్రమంతా కాంగ్రెస్ ఓడిపోయినా ఒక్క రాంపుర్ ఖాస్ లో మాత్రం తివారీ కుటుంబమే ఎందుకు గెలుస్తోందో అర్ధం కావటంలేదు. 

This post was last modified on March 11, 2022 8:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

15 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago