అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం వాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందులోకి విజయవాడ లాంటి బడా సిటీకి నగర మేయర్ గా ఉండటం అంటే మాటలా? చెప్పండి. అందుకే కాబోలు తన సత్తా అందరూ మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. బెజవాడ టౌన్ లోని మల్టీఫ్లెక్సుల యజమానులకు ఆమె రాసిన లేఖ గురించి తెలిసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకంటే.. అందులో విషయం అలాంటిది మరి.
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తన లెటర్ హెడ్ మీద థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు లేఖలు పంపారు. దాని సారాంశం ఏమంటే.. కొత్త సినిమా రాధే శ్యామ్ విడుదల సందర్భంగా మొదటి రోజున ప్రతి షోకు వంద చొప్పున టికెట్లు విత్ అవుట్ ఫెయిల్ పంపాలని కోరారు. పార్టీ కార్పొరేటర్లు.. నాయకులు.. కార్యకర్తలు సినిమా టికెట్లు అడుగుతున్నారని అందుకే తమకు పంపాలని ఆమె కోరారు.
అయితే.. అందుకు అయ్యే ఖర్చు లెక్కను చెల్లిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బెజవాడ సిటీలోని అన్ని థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు ఆమె ఇదే రీతిలో లేఖ రాయటం.. అది కాస్తా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మహానగరానికి మేయర్ అయ్యాక కూడా సినిమా టికెట్లను అడుగుతుంటే.. లేదని చెప్పటం ఆమెకు నచ్చలేదన్నట్లుంది. అందుకే.. నేరుగా థియేటర్ యజమానులకు.. మల్టీఫ్లెక్సులకు ఆమె లేఖ రాసి పంపారు.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో వచ్చిన అబ్లిగేషన్ కు ఎలా రియాక్టు కావాలో అర్థం కావట్లేదంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు మేయర్ స్థానంలో ఉన్న వారు ఎవరూ కూడా ఇలా సినిమా టికెట్లు గురించి అధికారికంగా లేఖ రాసింది లేదని చెప్పొచ్చు. మొత్తానికి మేయర్ ఆఫీస్ నుంచి థియేటర్లకు వచ్చిన రిక్వెస్టు కమ్ వార్నింగ్ పోలిన లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on March 11, 2022 6:45 pm
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…