అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం వాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అందులోకి విజయవాడ లాంటి బడా సిటీకి నగర మేయర్ గా ఉండటం అంటే మాటలా? చెప్పండి. అందుకే కాబోలు తన సత్తా అందరూ మాట్లాడుకోవాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. బెజవాడ టౌన్ లోని మల్టీఫ్లెక్సుల యజమానులకు ఆమె రాసిన లేఖ గురించి తెలిసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎందుకంటే.. అందులో విషయం అలాంటిది మరి.
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ తన లెటర్ హెడ్ మీద థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు లేఖలు పంపారు. దాని సారాంశం ఏమంటే.. కొత్త సినిమా రాధే శ్యామ్ విడుదల సందర్భంగా మొదటి రోజున ప్రతి షోకు వంద చొప్పున టికెట్లు విత్ అవుట్ ఫెయిల్ పంపాలని కోరారు. పార్టీ కార్పొరేటర్లు.. నాయకులు.. కార్యకర్తలు సినిమా టికెట్లు అడుగుతున్నారని అందుకే తమకు పంపాలని ఆమె కోరారు.
అయితే.. అందుకు అయ్యే ఖర్చు లెక్కను చెల్లిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బెజవాడ సిటీలోని అన్ని థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు ఆమె ఇదే రీతిలో లేఖ రాయటం.. అది కాస్తా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. మహానగరానికి మేయర్ అయ్యాక కూడా సినిమా టికెట్లను అడుగుతుంటే.. లేదని చెప్పటం ఆమెకు నచ్చలేదన్నట్లుంది. అందుకే.. నేరుగా థియేటర్ యజమానులకు.. మల్టీఫ్లెక్సులకు ఆమె లేఖ రాసి పంపారు.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో వచ్చిన అబ్లిగేషన్ కు ఎలా రియాక్టు కావాలో అర్థం కావట్లేదంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు మేయర్ స్థానంలో ఉన్న వారు ఎవరూ కూడా ఇలా సినిమా టికెట్లు గురించి అధికారికంగా లేఖ రాసింది లేదని చెప్పొచ్చు. మొత్తానికి మేయర్ ఆఫీస్ నుంచి థియేటర్లకు వచ్చిన రిక్వెస్టు కమ్ వార్నింగ్ పోలిన లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on March 11, 2022 6:45 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…