Political News

పంజాబ్ కూడా పాయే?

అధికారంలో లేని పార్టీలు ఎలాగైనా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి గ‌ద్దెనెక్కాల‌ని శ్ర‌మిస్తాయి. రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా పార్టీల ముఖ్య ల‌క్ష్యం ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అధికారం ద‌క్క‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. చేతిలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా చేజాతులారా వ‌దిలేసుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల ప్ర‌కారం పంజాబ్ పీఠం ఆప్‌కు ద‌క్కుతుంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో కాంగ్రెస్ భ‌విష్య‌త్‌పై మ‌రిన్ని సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

చూస్తూ ఉండిపోతే ఎలా?
ఒక‌ప్పుడు దేశంలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన హ‌స్తానికి ఇప్పుడు వాత‌మొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. కేంద్రంలో పెత్త‌నం చలాయించిన ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రాల్లో క‌నీసం అధికారం నిల‌బెట్టుకోలేక‌పోతోంది. పార్టీ నేత‌ల మధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో కొంపు ముంచుకుంటోంది. బీజేపీ ధాటికి నిల‌బ‌డి 2017లో పంజాబ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.

కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన న‌వ‌జోత్ సింగ్ సిద్ధూతో అమ‌రీంద‌ర్‌కు విభేదాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అది తెలిసి కూడా సిద్ధూను అధిష్ఠానం పీసీసీ అధ్య‌క్షుడిని చేసింది. దీంతో ముఖ్యమంత్రి ప‌ద‌వి వ‌దిలేసిన అమ‌రీంద‌ర్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా చ‌న్నీని కూర్చోబెట్టి వాళ్ల ఓట్లు రాబ‌ట్టాల‌ని చూసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. సిద్ధూకు చ‌న్నీకి మధ్య ఆరంభంలో విభేదాలు వ‌చ్చాయి. సీఎం అభ్య‌ర్థిత్వంలోనూ తేడా వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. కానీ అవ‌న్నీ ముగిసిన‌ట్లే కనిపించినా ఎన్నిక‌ల్లో మాత్రం దెబ్బ త‌ప్ప‌లేదు.

ప‌ట్టించుకుంటే క‌దా?
ఏదైనా రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చాయంటే వివిధ పార్టీల అధిష్థానం దానిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో వ్యూహాల‌కు తెర‌తీస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పంజాబ్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకున్న‌ట్లే క‌నిపించ‌లేదు. చాలా ఆల‌స్యంగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చన్నీనే పార్టీ ప్ర‌క‌టించింది. సిద్ధూతో క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించింది. కానీ సీఎం సీటుపై క‌న్నేసిన సిద్ధూ నిరాశ చెందార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ప్ర‌చారంలోనూ అధికార పార్టీది వెన‌కంజే. అక్క‌డ పాగా వేయ‌డం కోసం ఆప్ శ‌క్తికి మించి ప‌నిచేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంది. ఇప్పుడు అది ప్ర‌భావం చూపిందని విశ్లేష‌కులు అంటున్నారు. 

This post was last modified on March 9, 2022 2:13 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

2 mins ago

సుకుమార్ శిష్యులు మహా ఘటికులు

స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…

54 mins ago

మోడీ వ‌స్తున్నారు.. కూట‌మిలో జోష్‌, వైసీపీలో టెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం దిశ‌గా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న కూట‌మిలో మ‌రింత జోష్ పెర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే విజ‌యం ఖాయ‌మ‌నే ధీమాతో…

1 hour ago

వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా…

1 hour ago

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

2 hours ago

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

3 hours ago