Political News

పంజాబ్ కూడా పాయే?

అధికారంలో లేని పార్టీలు ఎలాగైనా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి గ‌ద్దెనెక్కాల‌ని శ్ర‌మిస్తాయి. రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా పార్టీల ముఖ్య ల‌క్ష్యం ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అధికారం ద‌క్క‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. చేతిలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా చేజాతులారా వ‌దిలేసుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల ప్ర‌కారం పంజాబ్ పీఠం ఆప్‌కు ద‌క్కుతుంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో కాంగ్రెస్ భ‌విష్య‌త్‌పై మ‌రిన్ని సందేహాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

చూస్తూ ఉండిపోతే ఎలా?
ఒక‌ప్పుడు దేశంలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన హ‌స్తానికి ఇప్పుడు వాత‌మొచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. కేంద్రంలో పెత్త‌నం చలాయించిన ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్రాల్లో క‌నీసం అధికారం నిల‌బెట్టుకోలేక‌పోతోంది. పార్టీ నేత‌ల మధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో కొంపు ముంచుకుంటోంది. బీజేపీ ధాటికి నిల‌బ‌డి 2017లో పంజాబ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.

కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన న‌వ‌జోత్ సింగ్ సిద్ధూతో అమ‌రీంద‌ర్‌కు విభేదాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అది తెలిసి కూడా సిద్ధూను అధిష్ఠానం పీసీసీ అధ్య‌క్షుడిని చేసింది. దీంతో ముఖ్యమంత్రి ప‌ద‌వి వ‌దిలేసిన అమ‌రీంద‌ర్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా చ‌న్నీని కూర్చోబెట్టి వాళ్ల ఓట్లు రాబ‌ట్టాల‌ని చూసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. సిద్ధూకు చ‌న్నీకి మధ్య ఆరంభంలో విభేదాలు వ‌చ్చాయి. సీఎం అభ్య‌ర్థిత్వంలోనూ తేడా వ‌చ్చిన‌ట్లు క‌నిపించింది. కానీ అవ‌న్నీ ముగిసిన‌ట్లే కనిపించినా ఎన్నిక‌ల్లో మాత్రం దెబ్బ త‌ప్ప‌లేదు.

ప‌ట్టించుకుంటే క‌దా?
ఏదైనా రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చాయంటే వివిధ పార్టీల అధిష్థానం దానిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో వ్యూహాల‌కు తెర‌తీస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పంజాబ్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకున్న‌ట్లే క‌నిపించ‌లేదు. చాలా ఆల‌స్యంగా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చన్నీనే పార్టీ ప్ర‌క‌టించింది. సిద్ధూతో క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించింది. కానీ సీఎం సీటుపై క‌న్నేసిన సిద్ధూ నిరాశ చెందార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ప్ర‌చారంలోనూ అధికార పార్టీది వెన‌కంజే. అక్క‌డ పాగా వేయ‌డం కోసం ఆప్ శ‌క్తికి మించి ప‌నిచేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంది. ఇప్పుడు అది ప్ర‌భావం చూపిందని విశ్లేష‌కులు అంటున్నారు. 

Satya

Recent Posts

అఖిల్ క‌దిలిపోయాడు… క‌దిలించేశాడు

టాలీవుడ్లో చాలామంది వార‌సులు స‌క్సెస్ ఫుల్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. వారిలో కొంద‌రికి ఆరంభం నుంచే క‌లిసొచ్చింది. కొంద‌రు కాస్త త‌డ‌బ‌డి…

2 hours ago

పిల్ల జమీందార్ దర్శకుడిపై చీటింగ్ కేసు

నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు…

4 hours ago

అఖిల్.. సమంత… ఒకరికోసం ఒకరు

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…

5 hours ago

రేవంత్ ఫ్లెక్సిలో జగన్ ఫొటో!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…

5 hours ago

‘రావణ్’ రంగంలోకి పొన్నవోలును దించిన జగన్

రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…

6 hours ago

డైరెక్టర్ కథ చెబితే… సీన్లు, డైలాగులు లేపేశారట

డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…

6 hours ago