Political News

చైనా బార్డర్‌లో ఉద్రిక్తత, మన సైన్యం ఎంత ఉంది?

భారత్ – చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది మరణం లేదా గాయాలై భారీ నష్టమే జరిగిందనే వాదనలు ఉన్నాయి. చర్చలు అంటూనే చైనా భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి బలం ఎంత, యుద్ధమే జరిగితే భారత సైన్యం ఎంత అనే చర్చ సాగుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కలిగిన దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2019 ప్రకారం చైనాకు 21,83,000 మిలిటరీ మ్యాన్ పవర్ ఉంది. అమెరికాలో 12,81,900, ఉత్తర కొరియాలో 12,80,000, రష్యాకు 10,13,628, పాకిస్తాన్‌కు 6,54,000, దక్షిణ కొరియాలో 6,25,000, ఇరాన్‌లో 5,23,000 సైన్యం ఉంది.

మన ఇండియన్ ఆర్మ్డ్‌ ఫోర్సెస్ విషయానికి వస్తే ఆర్మీలో యాక్టివ్‌గా 1,237,117, రిజర్వ్‌లో 960,000 ఉన్నారు. ఇండియన్ నేవీలో 67,228 మంది, రిజర్వ్‌లో 55,000 మంది ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 139,576 ఉండగా, రిజర్వ్‌లో 140,000 ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో యాక్టివ్ రోల్‌లో 1,443,921 ఉండగా, రిజర్వ్‌లో మొత్తం 1,155,000 ఉంది.

పారామిలిటరీ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ 11,000, అసోం రైఫిల్స్ 66,000, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ 10,000 ఉంటారు. ఇండియా – చైనా బార్డర్‌లో ఇండో – టిబెటన్ బార్డర్ పోలీస్ 89,432 ఉంది. హిమాలయ పర్వతసానుల్లో చైనా సరిహద్దుల్లో రక్షణను బలోపేతం చేసేందుకు భారత్ మౌంటేన్ స్ట్రైక్ దళాలను పెంచింది. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ పనాగర్‌లో ఉంది. వీరు లడక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్ఏసీ పొడవున 4,057 కిలోమీటర్లు ఉంటారు. పారా స్పెషల్ ఫోర్సెస్ బెటాలియన్ కూడా ఉన్నాయి. చైనా ఏదైనా దాటి చేస్తే వీరు వేగవంతంగా స్పందిస్తారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

7 hours ago