Political News

చైనా బార్డర్‌లో ఉద్రిక్తత, మన సైన్యం ఎంత ఉంది?

భారత్ – చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది మరణం లేదా గాయాలై భారీ నష్టమే జరిగిందనే వాదనలు ఉన్నాయి. చర్చలు అంటూనే చైనా భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి బలం ఎంత, యుద్ధమే జరిగితే భారత సైన్యం ఎంత అనే చర్చ సాగుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కలిగిన దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2019 ప్రకారం చైనాకు 21,83,000 మిలిటరీ మ్యాన్ పవర్ ఉంది. అమెరికాలో 12,81,900, ఉత్తర కొరియాలో 12,80,000, రష్యాకు 10,13,628, పాకిస్తాన్‌కు 6,54,000, దక్షిణ కొరియాలో 6,25,000, ఇరాన్‌లో 5,23,000 సైన్యం ఉంది.

మన ఇండియన్ ఆర్మ్డ్‌ ఫోర్సెస్ విషయానికి వస్తే ఆర్మీలో యాక్టివ్‌గా 1,237,117, రిజర్వ్‌లో 960,000 ఉన్నారు. ఇండియన్ నేవీలో 67,228 మంది, రిజర్వ్‌లో 55,000 మంది ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 139,576 ఉండగా, రిజర్వ్‌లో 140,000 ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో యాక్టివ్ రోల్‌లో 1,443,921 ఉండగా, రిజర్వ్‌లో మొత్తం 1,155,000 ఉంది.

పారామిలిటరీ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ 11,000, అసోం రైఫిల్స్ 66,000, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ 10,000 ఉంటారు. ఇండియా – చైనా బార్డర్‌లో ఇండో – టిబెటన్ బార్డర్ పోలీస్ 89,432 ఉంది. హిమాలయ పర్వతసానుల్లో చైనా సరిహద్దుల్లో రక్షణను బలోపేతం చేసేందుకు భారత్ మౌంటేన్ స్ట్రైక్ దళాలను పెంచింది. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ పనాగర్‌లో ఉంది. వీరు లడక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎల్ఏసీ పొడవున 4,057 కిలోమీటర్లు ఉంటారు. పారా స్పెషల్ ఫోర్సెస్ బెటాలియన్ కూడా ఉన్నాయి. చైనా ఏదైనా దాటి చేస్తే వీరు వేగవంతంగా స్పందిస్తారు.

This post was last modified on June 17, 2020 8:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

24 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago