చినబాబు కాన్ఫిడెన్స్ గా ఉన్నంత మాత్రాన
పార్టీ లో ఉన్న వారంతా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని అనుకోలేం
కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలే
ఇవాళ వైసీపీ కూడా చేస్తుండడం ఒక్కటే టీడీపీకి కలిసివచ్చే
విషయం అని రాజకీయ విశ్లేషకుల మాట! ఆంధ్రావనిలో వైసీపీని ఢీ కొనడం అంత సులువేం కాదు.అభివృద్ధి పనులు చేపట్టకపోయినా, సంబంధిత బిల్లులు పెండింగ్ లో ఉన్నా కూడా సంక్షేమం పై మాత్రం వైసీపీ సర్కారు ప్రేమ పెంచుకుంటుందే తప్ప తగ్గించుకోవడం లేదు.
తాజాగా జగనన్న తోడు పథకం కింద ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా చిరు వ్యాపారులకు సాయం అందించింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.ఇదే విధంగా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తూనే ఉంది. జాతీయ బ్యాంకులు సహకరించకపోయినా కొన్ని ప్రయివేటు బ్యాంకుల సహకారం తీసుకుని మరీ! అప్పులు చేస్తోంది.ఆ విధంగా లబ్ధిదారులకు ఎంతో ఇంతో సాయం చేస్తోంది.
కొన్ని సార్లు తలకుమించి భారంగా పథకాలు మారిపోయినా కూడా వెనక్కు తగ్గడం లేదు.ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు బలోపేతం అవుతుందే తప్ప బలహీన పడడం లేదు.ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసన మండలి సభ్యులు లోకేశ్ అంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చినబాబు ఆత్మవిశ్వాసానికి తగిన విధంగా పార్టీ అయితే లేదు.ఒకరో,ఇద్దరో పోరాడుతున్నారే తప్ప మిగిలిన వారంతా స్తబ్ధుగానే ఉండిపోతున్నారు.పోనీ అంతర్గత విమర్శకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ బలోపేతానికి ఏమయినా చర్యలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు.
అయినప్పటికీ లోకేశ్..సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో బన్నీమాదిరిగా చల్ చలో చలో అని పాడుకుంటూ పార్టీని నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న ఎప్పటి నుంచో చినబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారన్న వార్తలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా లోకేశ్ పనిచేస్తున్నారు.లోకేశ్ కూడా గతంలో కన్నా కొంచెం పరిణితితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆ విధంగా వైసీపీ కి ఇప్పటికిప్పుడు బలమైన ప్రత్యర్థిగా లోకేశ్ పేరు స్థిరం కాకపోయినా, ప్రజా పోరాటాలు చేస్తూ, అదే సమయంలో న్యాయ పోరాటాలకు కూడా ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితాలు అయితే అందుకుంటారు.
This post was last modified on March 2, 2022 8:17 am
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…