Political News

స‌ర్వం సాయిరెడ్డే.. వైసీపీలో అన్ని విభాగాల‌కు ఆయ‌నే బాస్‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్ప‌టికే కొన్ని జిల్లాల‌ను శాసిస్తున్న కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయి రెడ్డి ఇక‌పై స‌ర్వం తానే అయి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. పార్టీకి సంబంధించిన కీల‌క బాధ్య‌త‌లు అన్నింటినీ ఆయ‌నే చూసుకునేలా.. సీఎం జ‌గ‌న్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇక‌పై పార్టీలో అన్నీ తానే అయి.. సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను అప్పగించారు. ఈ విభాగాలకు విజయసాయిని ఇంఛార్జిగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. దాదాపు ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగా ఆయ‌న అన్ని విభాగాలు, స‌మ‌స్య‌లు.. ప‌రిష్కారాల‌ను చూస్తున్నారు. ఎక్క‌డ ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ఆయ‌నే స్పందిస్తున్నారు. అయితే.. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో విజయసాయిరెడ్డి ఇక నుంచి పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను కూడా చూసుకోనున్నారు.

గతంలో విజయసాయికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్.. కొంతకాలం క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఎందుకంటే.. అక్క‌డ సాయిరెడ్డి దూకుడు కార‌ణంగా.. తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని.. నాయ‌కులు గ‌గ్గోలు పెట్టారు. ముఖ్యంగా కీల‌క‌నేత‌లుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల‌కు కూడా సాయిరెడ్డి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.

అదేస మ‌యంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ను కూడాడ‌మ్మీ చేశార‌నే వాద‌న ఉంది. ఇక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో స‌ర్వం తానే అయి చ‌క్రం తిప్పారు. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు తీవ్రంగా మ‌ధ‌న ప‌డ్డారు. త‌మ అధికారం.. త‌మ ప్ర‌భావం రెండూ త‌గ్గిపోతున్నాయ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే సాయిరెడ్డిని అక్క‌డ నుంచి త‌ప్పించి.. ఖాళీగా కూర్చోబెట్టారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. తాజాగా వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను అప్పగించడంతో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు మరింత పెరగనున్నాయి. మ‌రి ఆయ‌న ఏవిధంగా స‌మ‌న్వ‌యం చేసుకుని.. పార్టీని ముందుకు న‌డిపిస్తారో చూడాలి.

This post was last modified on March 1, 2022 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్…

46 minutes ago

18 కోట్ల దోచేసిన పనివాళ్ళు

బెంగళూరులో పనిమనుషులుగా చేరిన ఒక నేపాలీ జంట తమ యజమానికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. నమ్మకంగా ఇంట్లో చేరి, కేవలం…

1 hour ago

సినిమా హిట్… దర్శకుడికి జీరో క్రెడిట్

దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. ఒక సినిమా కోసం ఎన్ని వందల మంది కష్టపడినప్పటికీ.. అది హిట్టయినా,…

1 hour ago

లోకేష్ సంకల్పం… వాళ్లకు సోషల్ మీడియా బ్యాన్ అయ్యేనా?

సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల పిల్లలు మానసిక…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ…

2 hours ago

లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న కీర్తి

గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్‌లో కీర్తి సురేష్‌ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…

3 hours ago