Political News

కేసీఆర్‌కే కాదు.. కాంగ్రెస్‌కు కూడా వ్యూహ‌క‌ర్త దొరికాడు

తెలంగాణ‌లో త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం.. రాజ‌కీయ ప‌క్షాలు వ్యూహ‌క‌ర్త‌ల‌ను పెట్టుకుంటున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ముందుస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహాల‌పై వ్యూహాలు వేసుకుంటున్నాయి. అయితే.. పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలను వ్యూహకర్తలే నిర్ణయించబో తున్నారు. ‘బీజేపీ ముఫ్త్ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నే రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ రంగంలోకి దిగారు.  ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎవరు ప్రత్యామ్నాయం అనే అంశంపై ఆయ‌న దృష్టి పెట్టారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నాయి. బీజేపీ నేతలు తమకు వ్యూహకర్తల అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, టీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న అవినీతి త‌మ‌కు ప్ర‌ధాన అస్త్రాల‌ని.. ప్ర‌చారం చేసుకుంటున్నారు.

మ‌రోవైపు టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. 40 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు వ్యూహకర్తల వ్యూహాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందులోభాగంగా ప్రశాంత్ కిషోర్ అనుచరుడైన సునీల్ కనుగోలు(ఎస్కే) సేవలను ఉయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సునీల్‌కు ఏపీతో అనుబంధం ఉంది. ఆయన విజయవాడ లో జన్మించారు. ప్రస్తుతం సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇప్పటికే సునీల్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి నట్లు తెలుస్తోంది.

ఆయనకు నేతలను విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా ఉందని చెబుతున్నారు. అందువల్ల ఎస్కేను కాంగ్రెస్ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మాదిరిగా వ్యూహకర్తల మీదగా ఆధారపడకుండా తన కార్యకర్తలనే బీజేపీ నమ్ముకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పర్యటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభా నియోజకవర్గాల వారీగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

ఆ పార్టీ నేత బండి సంజయ్ రెండోవిడత పాదయాత్రతో పాటు సభలు సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తార‌ని బీజేపీ అంచనా వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారమే లక్ష్యంగా కమలనాథులు బరిలోకి దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యూహ‌క‌ర్త‌లు ఏవిధంగా ఆయా పార్టీల‌ను గ‌ట్టెక్కిస్తారేది ఆస‌క్తిగా మారింది. 

Satya

Recent Posts

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక…

56 minutes ago

సమ్మతితో వేశ్యావృత్తి చేస్తే నో కేస్.. స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…

3 hours ago

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…

3 hours ago

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

4 hours ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

4 hours ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

6 hours ago