Political News

వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యానికి హైకోర్టు బ్రేక్..ఏం జ‌రిగిందంటే

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఆర్భాటంగా తీసుకువ‌చ్చిన ఒక ఆర్డినెన్స్‌పై.. హైకోర్టు అనూహ్యంగా బ్రేకులు వేసిం ది. ఇంకో మాట‌లో చెప్పాలంటే.. ప్ర‌బుత్వ‌మే త‌న‌కు తానుగా వెన‌క్కి త‌గ్గింది. దీంతో ఇప్పుడు స‌ర్కారు ఎలాంటి న‌నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై ఆధిప‌త్యం పెరిగిపోయింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అయినప్ప‌టికీ.. స‌ర్కారుఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం తెలిసిందే.

ఈ క్ర‌మంలో వైసీపీ కీల‌క నాయ‌కుడు.. వైవీ సుబ్బారెడ్డిని రెండుసార్లు బోర్డు చైర్మ‌న్‌గా చేశారు. అదేస‌మ యంలో జంబో బోర్డును ఏర్పాటు చేశారు. దీనిలో వైసీపీ మ‌ద్ద‌తు దారులు, పెట్టుబ‌డిదారుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఇది చాల‌ద‌న్న‌ట్టుగా.. ప్ర‌త్యేక ఆహ్వానితులుఅనే కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశారు. దీనిలో ఏకంగా 51 మందిని చేర్చారు. వీరిలో పొరుగురాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వీరికి జీతాలు లేకున్నా.. భ‌త్యాలు, స‌హాయకుల‌ను నియ‌మించారు. దీంతో టీటీడీపై భారీ ఎత్తున ఆర్థిక భారం ప‌డింది.

ఇక‌, ఈ ప్ర‌త్యేక ఆహ్వానితుల్లో చాలా మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బీజేపీకి చెందిన కీల‌క నేత‌,  మాజీ టీటీడీ బోర్డు స‌భ్యుడు  భాను ప్ర‌కాశ్‌రెడ్డి.. ప్ర‌త్యేక ఆహ్వానితుల అంశాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. దీనిపై స్టే ఇచ్చిన హైకోర్టు.. విచార‌ణ‌ల అనంత‌రం.. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక ఆహ్వానితుడుగా ఉండేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీనిపై విచార‌ణ చేసే వ‌ర‌కు ఎవ‌రినీ ఆహ్వానించ‌రాద‌ని కూడా చెప్పింది.

అయితే.. ఇంత‌లోనే ప్ర‌భుత్వం దూకుడుగా వెళ్లింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల విష‌యంపై హైకోర్టులో కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మయంలోనే దీనికి సంబంధించి ఒక ఆర్ఢినెన్స్ తీసుకువ‌చ్చింది. దీనిపై మ‌రోసారి.. కోర్టులో సోమ‌వారం విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంగా.. న్యాయ వాది అశ్వినీ కుమార్ ఆర్డినెన్స్ విష‌యాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం… తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ జ‌రుగుతుండ‌గా ఇదేం ప‌ని అని ప్ర‌శ్నించింది.

దీనిపై అస‌లు పూర్తిగా స్టే ఇస్తామ‌ని పేర్కొంది. దీంతో హ‌డ‌లి పోయిన‌.. అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఎస్‌. శ్రీరాం.. తాము ఆర్డినెన్స్ అయితే.. ఇచ్చాం కానీ.. కోర్టు తీర్పు త‌ర్వాతే.. దీనిపై అమ‌లు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. చెప్పేశారు. అంతేకాదు.. ఒక్క జభూమ‌న‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు. దీంతో ఆర్భాటానికి పోయిన ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఫ‌లితంగా చేసిన ఆర్డినెన్స్ బుట్ట‌దాఖ‌లైంది. 

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

1 hour ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

5 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

5 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

6 hours ago