తెలంగాణాలో జనసేన మళ్ళీ యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తోందా ? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలనే పెంచుతున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో మాట్లాడుతు ప్రతి నియోజకవర్గంలోను క్రియాశీల కార్యకర్తలను తయారు చేసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో కనీసం 100 మంది క్రియాశీల కార్యకర్తలను తయారుచేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకోవాలన్నారు.
తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నేతలంతా పనిచేయాలని నాదెండ్ల చెప్పటంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణాలో జనసేన పార్టీ నామమాత్రంగా ఉంది. కేవలం మీడియా ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. పవన్ ఎప్పుడైనా సమావేశాలు పెడితే అప్పుడు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తుంటుంది.
2014, 2019 లో జరిగిన ఎన్నికల్లోనే పవన్ తెలంగాణాను పూర్తిగా వదిలేశారు. దాంతో ఏపీలో ఏదో కాస్త ఉందని అనుకున్న పార్టీ యాక్టివిటీస్ తెలంగాణాలో దాదాపు శూన్యమైపోయాయి. అలాంటిది 2023లో షెడ్యూల్ ఎన్నికలు వస్తున్న సమయంలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ అనుకుంటున్నారంటేనే ఏదో తేడాగా ఉంది. తెలంగాణాలో టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయా అని అనిపిస్తోంది.
ఎందుకంటే ఏపీలో బీజేపీకి మిత్రపక్షమే అయినా తెలంగాణాలో మాత్రం అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పైగా ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపై బీజేపీ నానా రచ్చ చేస్తుంటే పవన్ మాత్రం కేటీయార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మొన్నటి భీమ్లానాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కేటీయార్ ను పవన్ ఆహ్వానించటమే నిదర్శనం. దీంతోనే పవన్ వ్యవహారశైలిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మెల్లిగా కేసీయార్ కు దగ్గరవుదామని పవన్ ప్రయత్నిస్తే రేపటికి అది పొత్తుగా మారే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఏపీలో కూడా బీజేపీతో కటీఫ్ తప్పదు మరి చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on February 28, 2022 4:23 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…