Political News

గోవిందా.. గోవిందా.. శ్రీవారి భక్తులకు మరో టోపీ

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఇటీవల కాలంలో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చౌక వినోదం పేరుతో సినిమా టికెట్ల ధరల్ని రోడ్డు మీద ఉండే టీ కొట్టులో అమ్మే కప్పు టీ కంటే తక్కువ ధరలను డిసైడ్ చేసిన ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. సేవల్లో పాల్గొనే విషయంలో వసూలు చేసే ఛార్జీలను మాత్రం భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. చౌక వినోదం గురించి గంటల కొద్దీ లెక్చర్లు ఇచ్చే అధికార వైసీపీ నేతలు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు చౌకగా ఎందుకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని ఎందుకు కల్పించరన్న దానిపై మాత్రం నోరు విప్పని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కొనుగోలు చేసిన వారికి ఇచ్చే స్వామివారి ప్రసాదంలో కక్కుర్తి విస్మయానికి గురి చేస్తోంది. ఆర్జిత సేవల్లో కొన్ని సేవలకు భక్తులకు స్వామి వారి కండువాల్ని అందజేస్తుంటారు. ఇందుకోసం నాణ్యమైన పట్టు వస్త్రాన్ని అందచేయటం ఏళ్లకు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అందుకు బదులుగా తాజాగా పట్టుకు బదులు పాలిస్టర్ కండువాలతో సరిపెట్టేస్తున్న టీటీడీ తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. నాణ్యత విషయంలో ఇలాంటి తీరు గతంలో మరెప్పుడూ లేదన్న మాట వినిపిస్తోంది.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. నాణ్యత విషయంలో భక్తులకు టోపీ పెట్టిన టీటీడీకి.. సరఫరాదారు చేస్తున్న మరో మోసం తాజాగా బయటకు వచ్చింది. ఇంతకాలం టీటీడీ తయారు చేసే స్వామి వారి ప్రసాదం కానీ.. ఇతర వస్తువులు కానీ నాణ్యతకు కేరాఫ్ అడ్రస్ మాదిరి ఉండేవి. అందుకు భిన్నంగా తాజా కండువా ఎపిసోడ్ చూసిన వారికి.. ఎలాంటి టీటీడీ.. ఎలా మారిందన్న మాట పలువురి భక్తుల నోటి నుంచి వస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.

ఆర్జిత సేవల టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇచ్చే కండువాకు సంబంధించిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అధికారిక పత్రాల్లోని సమాచారం ప్రకారం భక్తులకు ఇచ్చే ఒక్కో కండువాను రూ.90.65 చొప్పున వసూలు చేస్తున్నారని.. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.38కు మించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టులా ఉండే పాలిస్టర్ కండువాను భక్తులకు ఇవ్వటంపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ మాదిరి.. గతంలో పట్టు కండువాలో ఎరుపు.. ఆకుపచ్చ అంచుల్లో శంఖు చక్రాలతో పాటు.. నమో వెంకటేశాయ అనేఅక్షరాలు ఉండేవి. తాజాగా పంపిణీ చేస్తున్న కండువాల్లో టీటీడీ వ్యాక్యాలు ఉన్న జరి అంచును.. కండువాకు మిషన్ తో కుట్టిన వాటిని అందచేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. దీనిపై టీటీడీ ఏమంటుందో చూడాలి.

This post was last modified on February 27, 2022 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

2 minutes ago

చిరు విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

2 minutes ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

23 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

46 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

1 hour ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

2 hours ago