Political News

గోవిందా.. గోవిందా.. శ్రీవారి భక్తులకు మరో టోపీ

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు ఇటీవల కాలంలో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చౌక వినోదం పేరుతో సినిమా టికెట్ల ధరల్ని రోడ్డు మీద ఉండే టీ కొట్టులో అమ్మే కప్పు టీ కంటే తక్కువ ధరలను డిసైడ్ చేసిన ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని.. సేవల్లో పాల్గొనే విషయంలో వసూలు చేసే ఛార్జీలను మాత్రం భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. చౌక వినోదం గురించి గంటల కొద్దీ లెక్చర్లు ఇచ్చే అధికార వైసీపీ నేతలు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు చౌకగా ఎందుకు స్వామి వారి దర్శన భాగ్యాన్ని ఎందుకు కల్పించరన్న దానిపై మాత్రం నోరు విప్పని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కొనుగోలు చేసిన వారికి ఇచ్చే స్వామివారి ప్రసాదంలో కక్కుర్తి విస్మయానికి గురి చేస్తోంది. ఆర్జిత సేవల్లో కొన్ని సేవలకు భక్తులకు స్వామి వారి కండువాల్ని అందజేస్తుంటారు. ఇందుకోసం నాణ్యమైన పట్టు వస్త్రాన్ని అందచేయటం ఏళ్లకు ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అందుకు బదులుగా తాజాగా పట్టుకు బదులు పాలిస్టర్ కండువాలతో సరిపెట్టేస్తున్న టీటీడీ తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. నాణ్యత విషయంలో ఇలాంటి తీరు గతంలో మరెప్పుడూ లేదన్న మాట వినిపిస్తోంది.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. నాణ్యత విషయంలో భక్తులకు టోపీ పెట్టిన టీటీడీకి.. సరఫరాదారు చేస్తున్న మరో మోసం తాజాగా బయటకు వచ్చింది. ఇంతకాలం టీటీడీ తయారు చేసే స్వామి వారి ప్రసాదం కానీ.. ఇతర వస్తువులు కానీ నాణ్యతకు కేరాఫ్ అడ్రస్ మాదిరి ఉండేవి. అందుకు భిన్నంగా తాజా కండువా ఎపిసోడ్ చూసిన వారికి.. ఎలాంటి టీటీడీ.. ఎలా మారిందన్న మాట పలువురి భక్తుల నోటి నుంచి వస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.

ఆర్జిత సేవల టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇచ్చే కండువాకు సంబంధించిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అధికారిక పత్రాల్లోని సమాచారం ప్రకారం భక్తులకు ఇచ్చే ఒక్కో కండువాను రూ.90.65 చొప్పున వసూలు చేస్తున్నారని.. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.38కు మించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టులా ఉండే పాలిస్టర్ కండువాను భక్తులకు ఇవ్వటంపైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ మాదిరి.. గతంలో పట్టు కండువాలో ఎరుపు.. ఆకుపచ్చ అంచుల్లో శంఖు చక్రాలతో పాటు.. నమో వెంకటేశాయ అనేఅక్షరాలు ఉండేవి. తాజాగా పంపిణీ చేస్తున్న కండువాల్లో టీటీడీ వ్యాక్యాలు ఉన్న జరి అంచును.. కండువాకు మిషన్ తో కుట్టిన వాటిని అందచేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. దీనిపై టీటీడీ ఏమంటుందో చూడాలి.

This post was last modified on February 27, 2022 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

24 minutes ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

26 minutes ago

తప్పు ఒప్పేసుకున్న వీరభద్రుడు

బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…

1 hour ago

భోపాల్ భుజాల మీద బజ్ భారం

హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…

2 hours ago

మైక్‌తో పాటు హెల్మెంట్ తీసుకెళ్లండి.. మనోజ్ పంచ్

మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…

2 hours ago

దారుణం… సినిమా ఆశ చూపి లైంగిక దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్‌లోని గదికి…

2 hours ago