మంచి అయినా… చెడు అయినా కావచ్చు గుజరాత్ లోని పరిణామాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనెక్ట్ అయిపోతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనులు, రాజకీయాలు, అవకతవకలు బీజేపీ రథసారథిని టార్గెట్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ కుంభకోణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. గుజరాత్లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ తెలిపింది. ఈ కుంభకోణం జరిగిన సమయంలో ముఖ్యమంత్రి గా ఉన్న ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం ఈ మకిలి అంటిందని ఆరోపించారు.
కోల్ ఇండియా 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును గుజరాత్లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరిట పంపించింది. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధిక ధరకు అమ్మేసుకున్నారని తద్వారా గుజరాత్ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గు లావేదేవీలతో బీజేపీ పెద్దలకు లింక్లు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.
ప్రభుత్వం ద్వారా సరఫర అయిన బొగ్గు ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్న ఈ భారీ కుంభకోణంపై నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బొగ్గు కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, విజయ్ రూపాణీ, భూపేంద్ర పటేల్) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాకు చెప్పారు.
కోల్ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు. బొగ్గు లబ్ధిదారుల గురించి గుజరాత్ ప్రభుత్వం పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు.
This post was last modified on February 26, 2022 8:13 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…