Political News

మోడీ మెడ‌కు 6000 కోట్ల గుజ‌రాత్ స్కాం?

మంచి అయినా… చెడు అయినా కావ‌చ్చు గుజరాత్ లోని ప‌రిణామాలు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి క‌నెక్ట్ అయిపోతాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్థానికంగా జ‌రిగే అభివృద్ధి ప‌నులు, రాజ‌కీయాలు, అవ‌క‌త‌వ‌క‌లు బీజేపీ ర‌థ‌సార‌థిని టార్గెట్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ కుంభ‌కోణం విష‌యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. గుజరాత్‌లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ కుంభ‌కోణం జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి గా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సైతం ఈ మ‌కిలి అంటింద‌ని ఆరోపించారు.

కోల్‌ ఇండియా 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును  గుజరాత్‌లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరిట పంపించింది. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధిక ధరకు అమ్మేసుకున్నార‌ని త‌ద్వారా గుజ‌రాత్ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గు లావేదేవీలతో బీజేపీ పెద్ద‌ల‌కు లింక్‌లు ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్ర‌భుత్వం ద్వారా స‌ర‌ఫ‌ర అయిన బొగ్గు ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్న ఈ భారీ కుంభ‌కోణంపై నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. బొగ్గు కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, విజయ్‌ రూపాణీ, భూపేంద్ర పటేల్‌) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్‌ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మీడియాకు చెప్పారు.

కోల్‌ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు. బొగ్గు  లబ్ధిదారుల గురించి గుజరాత్‌ ప్రభుత్వం పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు. ఈ విష‌యంలో బీజేపీ పెద్ద‌లు స్పందించాల‌ని డిమాండ్ చేశారు.

This post was last modified on February 26, 2022 8:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago