Political News

స‌తీష్ రెడ్డి.. ఏమిటీ గ‌తి?

పులివెందుల‌లో వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన నేత‌గా ఆయ‌న‌కు గొప్ప పేరుంది.. తెగించి మ‌రీ పార్టీని ముందుకు న‌డిపార‌నే గుర్తింపు ఉంది. కానీ ఆ నేత ప్ర‌స్తుత రాజ‌కీయ భ‌విష్య‌త్ అయోమ‌యంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీలో లేక‌.. ఏం చేయాలో పాలుపోక క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నార‌ని తెలిసింది. ఆ నాయ‌కుడే స‌తీష్ రెడ్డి. క‌డ‌ప జిల్లా సీనియ‌ర్ నేత అయిన స‌తీష్ ఇప్పుడు రాజ‌కీయాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. టీడీపీకి రాజీనామా చేసిన త‌ర్వాత ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ ముందుకు సాగ‌డం లేదు.

పులివెందుల‌లో గ‌త కొన్నిసార్లుగా వైఎస్ కుటుంబంపై పోటీ చేసి స‌తీష్ సంచ‌ల‌నం సృష్టించారు. ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొన్నార‌న్న ఏకైక కార‌ణంతోనే ఆయ‌న‌కు టీడీపీలోనూ రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. అందుకే చంద్ర‌బాబు స‌తీష్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి ప్రాధాన్య‌త కల్పించారు. మ‌రోవైపు పులివెందుల‌కు నీరు అంటూ శ‌ప‌థం చేసిన స‌తీష్ గ‌డ్డం పెంచి త‌ర్వాత మొక్కు తీర్చుకున్నారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మితో ఆయ‌న స్లో అయ్యార‌ని అంటున్నారు. ఆ ప‌రాజ‌యం త‌ర్వాత టీడీపీ కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, లోకేష్ నాయ‌క‌త్వంలో ఆ పార్టీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి పార్టీకి రాజీనామా చేశారు.

టీడీపీని వీడిన త‌ర్వాత స‌తీష్ వైసీపీలో చేర‌తార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ త‌న కుటుంబానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డ వ్య‌క్తిని చేర్చుకోవ‌డం ఇష్టం లేక జ‌గ‌న్ ప‌క్క‌న‌పెట్టార‌ని అంటుంటారు. దీంతో ఇప్పుడు వైసీపీ, టీడీపీకి ఆయ‌న దూరంగా ఉంటున్నారు.

తాజాగా పులివెందుల‌లో టీడీపీ ఇంఛార్జీగా బీటెక్ ర‌విని బాబు నియ‌మించ‌డంతో ఇక స‌తీష్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు ప‌డుతుంద‌ని అనిపిస్తోంది. కానీ మ‌రోవైపు ర‌విని పులివెందుల టీడీపీ క్యాడ‌ర్ ఓన్ చేసుకోలేక‌పోతుంద‌ని అంటున్నారు. అందుకే మ‌ళ్లీ స‌తీష్‌ను పార్టీలోకి తీసుకుని నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీగా నియ‌మిస్తే మంచిద‌ని కొంత‌మంది నేత‌లు బాబు సూచించారు. కానీ స‌తీష్ పార్టీలోకి వ‌చ్చినా టికెట్ ఇచ్చేది లేద‌ని, ర‌వినే నిల‌బెడ‌తాన‌ని బాబు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో స‌తీష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. 

This post was last modified on February 25, 2022 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

35 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

38 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago