ఈ రోజు లడఖ్ పరిధిలోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా – భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించినట్లు ఉదయం వార్తలు విన్నాం కదా. ప్రపంచమంతా చీ కొడుతున్నా చైనా బుద్ధి మారలేదు. అయితే అత్యంత విషాదకరం ఏంటంటే… ఈరోజు దేశం కోసం తుది శ్వాస విడిచిన వ్యక్తి సూర్యాపేట వాసి అని తాజాగా వెల్లడయ్యింది. ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి ఈ రోజు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది.
సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్.. భార్యాపిల్లలున్నారు. వారి కుటుంబం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ లో ఉంటోంది. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే సూర్యాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చైనా దాహానికి, కవ్వింపులకు మన తెలుగువాడు బలికావడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. రేపు సాయంత్రం లోపు సంతోష్ భౌతిక కాయం సూర్యపేటకు చేరుకోనుంది. ఈ వార్త విన్న వెంటనే సంతోష్ భార్య కుప్పకూలిపోయారు. తండ్రికి ఏం జరిగిందో తెలియని అమాయకపు దశ ఆ చిన్నారులు ఇద్దరిదీ. ఎంతో భవిష్యత్తు ఉన్న సంతోష్ ఇలా అర్ధంతరంగా కన్నుమూయడం విషాదకరం.
ఒక టాప్ హీరో వారసత్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టి అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. మొత్తం ఇండియన్…
పెద్దిలో అందరూ రామ్ చరణ్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. దర్శకుడు…
జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని,…
కొన్ని నెలలుగా సరైన పెద్ద సినిమా లేని టైంలో రిలీజైంది పెద్ది. ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్న టైంలో విడుదల కావడం…
జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి…
తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని…