ఈ రోజు లడఖ్ పరిధిలోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా – భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించినట్లు ఉదయం వార్తలు విన్నాం కదా. ప్రపంచమంతా చీ కొడుతున్నా చైనా బుద్ధి మారలేదు. అయితే అత్యంత విషాదకరం ఏంటంటే… ఈరోజు దేశం కోసం తుది శ్వాస విడిచిన వ్యక్తి సూర్యాపేట వాసి అని తాజాగా వెల్లడయ్యింది. ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి ఈ రోజు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది.
సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్.. భార్యాపిల్లలున్నారు. వారి కుటుంబం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ లో ఉంటోంది. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే సూర్యాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చైనా దాహానికి, కవ్వింపులకు మన తెలుగువాడు బలికావడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. రేపు సాయంత్రం లోపు సంతోష్ భౌతిక కాయం సూర్యపేటకు చేరుకోనుంది. ఈ వార్త విన్న వెంటనే సంతోష్ భార్య కుప్పకూలిపోయారు. తండ్రికి ఏం జరిగిందో తెలియని అమాయకపు దశ ఆ చిన్నారులు ఇద్దరిదీ. ఎంతో భవిష్యత్తు ఉన్న సంతోష్ ఇలా అర్ధంతరంగా కన్నుమూయడం విషాదకరం.
This post was last modified on June 16, 2020 8:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…