Political News

జనసేన అసలు పని మరిచిపోతోందే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో 217 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవోను ఉపసంహరించుకోకపోతే జనసేన అధికారంలోకి వచ్చిన వారంలోనే చట్టాన్ని మార్చేస్తుందన్నారు. పైగా చేపల చెరువుల్లో బడాబాబులు ఎవరు పెట్టుబడులు పెట్టద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు.

కోటీశ్వరులకు ఇంకా చిన్న చిన్న చేపల చెరువులతో ఏమిపనంటు నిలదీశారు. తమ ప్రభుత్వం రాగానే కోటీశ్వరులు పెట్టిన పెట్టుబడులను మత్స్యకారుల సొసైటీలకు చెందేట్లు చేస్తుందన్నారు. అప్పుడు తమను జనసేన దెబ్బకొట్టిందని ఏడిస్తే ఉపయోగం లేదన్నారు. అందుకనే తాను ముందుగానే బడాబాబులను హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. మత్స్యాకారులంతా జనసేనకు మద్దతుగా నిలబడాలని, తమకే ఓట్లేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే మత్స్యకారుల కోసం ఏమేమి చేయాలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటుందన్నారు. సముద్రం లోతుల్లో ఈదే సామర్థ్యం ఉన్న మత్స్యకారులకు ట్రైనింగ్ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎందుకు పంపకూడదంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరిని కూడా దేహీ అనే అవసరం లేకుండా మత్స్యకారులను జనసేన ప్రభుత్వం తీర్చి దిద్దుతుందని హామీ ఇచ్చారు. జనసేనకు గనుక అసెంబ్లీలో 10 మంది ఎంఎల్ఏలుండుంటే ఇలాంటి చట్టాలను చింపేసే వారమన్నారు.

మొత్తం మీద పవన్ మాటలు విన్న తర్వాత ఎన్నికలు పెట్టడమే ఇక ఆలస్యం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేయటమే మిగిలిందన్నట్లుగా అనిపించింది. అంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై పవన్ లో చాలా పెద్ద ఆశలే ఉన్నట్లు అర్ధమవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే అందుకు తగ్గ కార్యాచరణ ఉందా అన్నదే అనుమానం. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపిక, గ్రామస్ధాయిలో పార్టీని బలోపేతం చేయటం, ప్రతి మండలంలోను గట్టి నేతలను రెడీ చేసుకోవటం లాంటి చాలా పనులున్నాయి. ముందు పార్టీని బలోపేతం చేసుకోవటంపై పవన్ దృష్టిపెడితే అధికారం దానంతట అదే వస్తుంది.

ఇప్పటికీ పవన్, నాదెండ్ల తప్ప ఆ పార్టీలో రాష్ట్రం మొత్తం తెలిసిన ఒక అసలు సిసలు రాజకీయ నాయకుడు లేరు. ఎంత కొత్త రాజకీయం చేసినా పార్టీలు నిలబడ్డానికి అవసరమైన బలమైన నేతలు కావాలి. నేటి యువత క్రేజ్ ఉన్న లీడర్లపై ఆకర్షితులు అవుతారు. కాబట్టి పవన్ ఒక్కడా అన్ని చోట్ల అభ్యర్థి కాలేడు. కాబట్టి ముందు ప్రతి నియోజకవర్గంలో కాస్త పేరున్న నేతలను కనిపెట్టాలి. అపుడే జనసేన కలలు గెలుపు వైపు ప్రయాణం మొదలుపెడతాయి.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

41 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago