Political News

ఓఎంసీ లీజుల కుట్రలో శ్రీలక్ష్మి ఇరుక్కున్నట్లేనా ?

అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లిమిటెడ్ కు మైనింగ్ లీజులు కట్టబెట్టిన ఘటనలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పూర్తిగా తగులుకున్నట్లేనా ? తాజాగా తెలంగాణా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. పై కంపెనీకి లీజులు కట్బెట్టే విషయంలో పెద్దఎత్తున అవినీతి జరిగింనేందుకు ఆధారాలున్నాయని కోర్టు తెల్చిచెప్పింది. జరిగిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రమేయంపై సరిపడా ఆధారాలున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.

జరిగిన అవినీతిలో తన పాత్ర లేదని, లీజుల కేటాయింపులో తాను నిబంధనలను అనుసరించినట్లు నిరూపించుకోవాల్సిన బాధ్యత కార్యదర్శి మీదే ఉందని కూడా కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఓఎంసీ కన్నా ముందే మరికొన్ని కంపెనీలు లీజుల కోసం దరఖాస్తులు చేసుకున్నా వాటిని పక్కన పెట్టేసినట్లు, ఈ క్రమంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ కేసుల విషయంలోనే శ్రీలక్ష్మి చాలా సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటున్నారు. కొంతకాలం ఆమె జైల్లో కూడా ఉండి ప్రస్తుతం బెయిల్ మీద బయటున్నారు.

లీజుల కేటాయింపుల తన ప్రమేయం లేదని, కేవలం తాను నిబంధనలను మాత్రమే అనుసరించానని శ్రీలక్ష్మి వేసిన కేసులను కోర్టు కొట్టేసింది. ఆమె వాదనలో పసలేదని కోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. మైనింగ్ లీజులన్నీ కేంద్రం పరిధిలోనివి కాబట్టి ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను కోర్టు కొట్టేసింది. ఒఎంసీకి లీజులు ఇవ్వాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపానలని ప్రాధమిక ఆధారాలనుబట్టి అర్ధమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.

శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నపుడే ఆమె మరిది రాజేష్ బాబు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టు చెప్పింది. ఈ విషయం మీద కూడా విచారణను ఎదుర్కోవాల్సిందే అని కోర్టు తేల్చింది. లీజుల వ్యవహారంలో సీబీఐ పరిధిపై శ్రీలక్ష్మి లేవనెత్తిన అనేక అభ్యంతరాలను కూడా కోర్టు కొట్టేసింది. సీబీఐ పరిధిని నిర్ధారించే అవకాశం శ్రీలక్ష్మికి లేదని కోర్టు అభిప్రాయపడింది. అవినీతి జరిగిందని వచ్చే ఆరోపణలపై ప్రాధమిక ఆధారాలున్న ప్రతి కేసును సీబీఐ విచారించవచ్చని కోర్టు చెప్పింది. సో కోర్టు వ్యాఖ్యల తాజా పరిస్ధితుల్లో శ్రీలక్ష్మి విషయంలో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on February 20, 2022 10:27 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

55 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

2 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

3 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

4 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

4 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

5 hours ago